Switch to English

టాలీవుడ్ డ్రగ్స్ కేసులు ఇప్పట్లో తేలేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

సుశాంత్ ఆత్మహత్యతో మరోసారి తెరపైకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం.. అటు బాలీవుడ్ తోపాటు కోలీవుడ్ నూ కుదిపేస్తోంది. రోజుకో తారామణి పేరు బయటకు వస్తోంది. తాజాగా మహేశ్ బాబు భార్య నమ్రత పేరు కూడా ఈ వ్యవహారంలో వెలుగుచూడటం ఒక్కసారిగా సంచలనం రేపింది. అయితే, ఆమెకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని నమ్రత బృందం స్పష్టంచేసింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఈ ఉదంతం పక్కనపెడితే.. టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. మూడేళ్ల క్రితం తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన కీలక విషయాలన్ని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్ననెన్స్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆ శాఖ బదులిచ్చింది.

హైదరాబాద్ లో గత మూడేళ్లలో డ్రగ్స్ కు సంబంధించి 12 కేసులు నమోదు కాగా, 8 కేసుల్లో చార్జిషీట్లు వేశామని, నాలుగింటిలో ఇంకా చార్జిషీట్లు దాఖలు చేయలేదని వెల్లడించింది. ఈ నాలుగింటిలో రెండు కేసులు 2017లో టాలీవుడ్ లో నమోదైనవేనని తెలుస్తోంది. అప్పట్లో టాలీవుడ్ లో సంచలనం రేపిన ఈ వ్యవహారంలో తొలుత దర్యాప్తు వేగంగానే సాగింది. పలువురు సినీ ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, తర్వాత ఈ కేసు దర్యాప్తు నీరుగారిపోయింది.

హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డుప్రమాదంలో చనిపోయిన తర్వాత అతడి ఫోన్ లో దొరికిన సమాచారాన్ని బట్టి కొంతమంది డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. వారి విచారణలో కీలక విషయాలు తెలుస్తాయని.. టాలీవుడ్ డొంక కదులుతుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు. ఆ కేసులో ఇప్పటివరకు కనీసం చార్జిషీటు కూడా దాఖలు చేయలేదని తాజాగా వెల్లడైంది. ఈ కేసులు ఇప్పట్లో తేలే అవకాశం ఉందా లేదా అంటే సందేహంగానే కనిపిస్తోంది.

ఇక ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన 8 చార్జిషీట్లలో ఆసక్తికరమైర విషయాలు ఉన్నాయి. ఇంగ్లండ్, జర్మనీ తదితర దేశాల నుంచి కొరియర్ల ద్వారా డ్రగ్స్ వస్తున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. చాలా చిన్నమొత్తంలో అవి వస్తుండటం వల్ల అన్నింటినీ పట్టుకోవడం సాధ్యం కావడంలేదని వెల్లడించారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...