Switch to English

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి: ఆ నలుగురి అరెస్ట్‌తో వైసీపీ ‘డొంక’ కదులుతుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,845FansLike
57,764FollowersFollow

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి’ వ్యవహారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుంది.

వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోలుకు సంబంధించి టీటీడీ అడ్డగోలుగా వ్యవహరించిందనీ, అప్పటి టీటీడీ బోర్డు, అధికార పార్టీ కనుసన్నల్లో తిరుమల పవిత్రతను చెడగొట్టేలా వ్యవహరించిందనీ, అధికారులు సైతం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో అక్రమాలకు పాల్పడ్డారనీ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

తిరుపతి లడ్డూ కల్తీ గురించి తొలుత సీఎం చంద్రబాబునాయుడు సంచలన ప్రకటన చేయగా, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా వెంకన్న భక్తులందరి దృష్టికి తీసుకెళ్ళారు.

ఓ దశలో రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని’ ఏర్పాటు చేయగా, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు కోర్టును ఆశ్రయించగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’లో కేంద్ర ప్రభుత్వానికీ భాగం వుండేలా సుప్రీంకోర్టు, కొత్త సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రత్యేక దర్యాప్తు బృందం పలు కోణాల్లో విచారించి, తాజాగా నలుగురు నిందితుల్ని అరెస్టు చేయడం సంచలనంగా మారింది. అరెస్టయినవారిలో బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పామిల్ జైన్ (ఉత్తరాఖండ్), శ్రీ వైష్ణవీ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అపూర్వ చావడా, ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్ తదితరులు అరెస్టయ్యారు.

‘సిట్’ బృందం పైన పేర్కొన్న నిందితుల్ని విచారించినప్పుడు, పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.

గత కొద్ది రోజులుగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, కొందరు వైసీపీ నేతలు.. తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి, సిట్ బృందం ఎటూ తేల్చడంలేదనీ, సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు కొట్టివేయనుందనీ పుకార్లు పుట్టించిన విషయం విదితమే.

ఇంతలోనే, ఈ కేసులో నిందితుల అరెస్టు వెలుగులోకి రావడం గమనార్హం. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందన్నది నిర్వివాదాంశం. ఇది తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తీసుకున్న ప్రతి భక్తుడికీ తెలుసు.

టెండర్లలో అక్రమాల్ని సిట్ వెలుగులోకి తీసుకొస్తోంది. అసలంటూ టన్నుల కొద్దీ నెయ్యి సరఫరా చేసే స్థాయి లేని బోలేబాబా డెయిరీకి ఎలా కాంట్రాక్టు వెళ్ళింది.? ఈ అక్రమ ఒప్పందాల వెనుక ఎవరున్నారన్నదానిపై నిజాలు నిగ్గు తేలాల్సిందే.

అరెస్టయినవారు జస్ట్ పావులు మాత్రమే, ఆ పావులు కదిపిన పెద్దల లెక్క తేలాల్సి వుంది. పెద్దలు కాదు, అవి వైసీపీ గద్దలు.. అన్నది బహిరంగ రహస్యం.

ఐదేళ్ళలో తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించిన వైసీపీ, తిరుపతి లడ్డూని అపవిత్రం చేసిందన్న విషయంలో వెంకన్న భక్తులకు రెండో అభిప్రాయమే లేదు.!

సినిమా

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

రాజకీయం

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

ఎక్కువ చదివినవి

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

‘నా సూర్యుడివి.. నా చంద్రుడివి’.. తండ్రిపై మనోజ్ ఎమోషనల్ పోస్టు

ఈ నడుమ మంచు ఫ్యామిలీలో వివాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మనోజ్ ఒక్కడు ఒకవైపు ఉంటే మిగతా ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంది. కుటుంబంలో గొడవలు కేసులు పెట్టుకునే...

ప్రతిసారీ ప్రకాష్ రాజ్ ఎందుకు ఎగేసుకుంటూ వస్తున్నట్టు.?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్‌కి కూడా అత్యంత సన్నిహితుడే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో, ప్రకాష్ రాజ్ తరఫున బలంగా నిలబడ్డారు నాగబాబు. మరి, ప్రకాష్...