తిరుమల లడ్డూకి వున్న ప్రాముఖ్యత గురించి అందరికీ తెల్సిందే. కానీ, ఆ తిరుపతి లడ్డూ చుట్టూ చాలా వివాదాలు గత కొన్నాళ్ళుగా చూస్తున్నాం. లడ్డూ ధరల పెంపుపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తున్నా.. టీటీడీ, ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుపోతున్నాయి. లడ్డూ ధర 50 రూపాయలకు వెళ్ళింది. ఈ మధ్యనే లడ్డూల డిస్కౌంట్ని అటకెక్కించడం.. అది కాస్తా వివాదాస్పదమవడం తెల్సిన విషయమే. ‘అందరికీ చిన్న లడ్డూ ఉచితంగా ఇస్తున్నాం..’ అని టీటీడీ చెప్పినా వివాదం సద్దుమణగలేదు. ఇంతలో కరోనా వచ్చింది.. శ్రీవారి దర్శనమే దొరకడంలేదు భక్తులకి. ఇక, లడ్డూ సంగతి సరే సరి.
ఇదిలా వుంటే, ఈ మధ్యనే తిరుపతిలో వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని విక్రయించే కార్యక్రమం చేపట్టిన టీటీడీ, మరింతగా శ్రీవారి భక్తులకు లడ్డూల్ని అందించడానికి ముందుకొచ్చింది. ఈసారి మాత్రం 50 రూపాయల ధరకి కాదు.. అందులో సగం ధరకే.. అంటే 50 శాతం డిస్కౌంట్తో లడ్డూని అందిస్తారన్నమాట. భలే మంచి చౌక బేరము.. అనుకోవాలా.? లడ్డూ ‘ప్రసాదం’ అయినప్పుడు, దాన్ని అమ్మేయడం కోసం ఈ జిమ్మిక్కులేంటి.? అని బాధపడాలా.?
917156 24799Sweet internet site , super pattern , rattling clean and use friendly . 807001
750693 549162Glad to be 1 of many visitants on this awing internet web site : D. 55992
306639 76457Thank you for the auspicious writeup. It in fact was a amusement account it. Look advanced to a lot more added agreeable from you! Even so, how could we communicate? 905677