నాయకుడు సినిమా కంటే థగ్ లైఫ్ పెద్ద హిట్ అవుతుందని విశ్వ నటుడు కమల్ హాసన్ అన్నారు. కమల్, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీ జూన్ 5న రాబోతోంది. ఈ మూవీని దర్శకుడు మణిరత్నం తెరకెక్కించారు. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో కమల్ మాట్లాడుతూ.. ‘మణిరత్నం గారు నాకు చాలా స్పెషల్. ఆయన గతంలో నాయకుడు సినిమాతో భారీ హిట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మూవీతో అంతకంటే సర్ ప్రైజ్ హిట్ ఇవ్వబోతున్నారు. చాలా మంది నన్ను గురువు స్థానంలో చూస్తున్నారు. కానీ నేను ద్రోణాచార్యుడిని కాదు.. ఇంకా స్టూడెంట్ గానే ఉన్నాను. అన్నీ నేర్చుకుంటూనే ఉన్నాను. ఈ మూవీని అందరం కష్టపడి చేశాం. మణిరత్నం గారితో సినిమా అంటే.. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం. శింబు సినిమాలు ఎప్పుడూ చూస్తాను. ఈ మూవీతో అతనితో బాగా కనెక్ట్ అయ్యాను. అతను చాలా బాగా నటించాడు. ఈ మూవీ పెద్ద హిట్ అవుతుంది. అందరూ ఎంజాయ్ చేయండి’ అంటూ తెలిపారు.
డైరెక్టర్ మణిరత్నం మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ తో చేసిన నాయకుడు సినిమా వెనక ఓ పెద్ద కథ ఉంటుంది. అనుకోకుండా చేసిన ఆ మూవీ మంచి హిట్ అయింది. కానీ ఇప్పుడు చేసిన థగ్ లైఫ్ అనుకుని అన్నీ సెట్ చేసుకున్నాకే చేశాం. ఆయనతో ఇన్నేళ్ల తర్వాత సెకండ్ సినిమా అవకాశం రావడం ఆనందంగా ఉంది. కమల్ హాసన్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. ఆయన డైరెక్టర్ కు అనుకూలంగా ఉంటారు’ అని చెప్పుకొచ్చారు.
హీరో శింబు మాట్లాడుతూ ‘తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్నారు. త్వరలోనే ఓజీలో ఓ సాంగ్ రాబోతోంది. దాన్ని నేనే పాడాను. అది నాకు ఒక కల. మణిరత్నం గారితో సినిమా చేస్తే చాలా విషయాలు నేర్చుకుంటాం. క్రమశిక్షణ, హార్డ్ వర్క్ మళ్లీ అలవాటు అవుతాయి. కమల్ హాసన్ గారితో వర్క్ చేయడం నిజంగా గొప్ప అనుభూతి’ అంటూ చెప్పుకొచ్చాడు.
హీరోయిన్ త్రిష మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ గారితో జర్నీ ఎప్పుడూ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆయనతో వర్క్ చేసే అవకాశం రావడం నా అదృష్టం. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ మూవీని ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. నాకు హైదరాబాద్ సెకండ్ హోమ్. ఈ మూవీని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది త్రిష.
సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ.. ‘ఈ మూవీతో బెస్ట్ ట్యాలెంటెడ్ యాక్టర్లు కలిసి నటించారు. ఇది చాలా మంచి మూవీ. ఇలాంటివి మళ్లీ మళ్లీ రావు. కాబట్టి అందరూ కుటుంబాలతో వచ్చి మూవీని చూసి ఎంజాయ్ చేయండి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకం మాకు ఉంది. ఈ మూవీని కూడా ఆదరించండి’ అంటూ చెప్పింది.
