వృద్యాప్యంలో తమకు తోడుగా ఉండి, చనిపోయిన సమయంలో దహన సంస్కారాలు చేస్తారనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు కూడా కొడుకో లేదంటే కూతురు కావాలని కోరుకుంటారు. కాని మంగళగిరికి చెందిన ధనలక్ష్మి అనే అభాగ్యురాలు మృతి చెందిన తర్వాత కొడుకు ఉన్నా కూడా అనాధ శవం మాదిరిగా రోడ్డున పడినది. ఆమె మృతి చెందిన తర్వాత కొడుకు నాగ మల్లేశ్వరరావు కనీసం ఆమె మొహం కూడా చూసేందుకు ఆసక్తి చూపించలేదు. కేవలం ఆస్తి కోసమే ఆమెను అత్యంత దారుణంగా ప్రవర్తించాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… ధనలక్ష్మి భర్త కొన్నాళ్ల క్రితం మృతి చెందాడు. ఆ సమయంలో ఆస్తి ఇస్తేనే తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తానంటూ చెప్పడంతో ధనలక్ష్మి కొడుకు నాగ మల్లేశ్వరరావుకు సగం ఆస్తిని రాసి ఇచ్చింది. మిగిలిన సగంను కూడా రాసి ఇవ్వాలంటూ గత కొంత కాలంగా గొడవ పెడుతున్నాడు. కొడుకు బాధ భరించలేక బిడ్డ వద్దకు వెళ్లింది.
అక్కడ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. బిడ్డకు ఆస్తి ఇచ్చిందనే కోపంతో మల్లేశ్వరరావు తల్లి మృత దేహంను ఇంట్లోకి రానిచ్చేది లేదంటూ గొడవకు దిగాడు. ఎట్టి పరిస్థితుల్లో తల్లికి అంత్యక్రియలు చేయను అంటూ అతడు భీష్మించడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి వారే అంత్యక్రియలు చేయించారు.
572769 356388How do I know if a Wordpress theme supports a subscribe option? 199304
7096 708492Hey, are you having issues with your hosting? I needed to refresh the page about million times to get the page to load. Just saying 657286