Switch to English

ఈసారి జగన్ 2.0 ని చూపిస్తా.. 30 ఏళ్లు సీఎం గా ఉంటా.. వైఎస్ జగన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,843FansLike
57,764FollowersFollow

తాడేపల్లి లో ఏర్పాటుచేసిన వైసీపీ కార్పొరేటర్ల సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో చర్చించారు. అధికారం కోల్పోయినప్పుడు కష్టాలు తప్పవని చెప్పిన ఆయన.. ఈసారి జగన్ 2.0 ని చూపిస్తానని వ్యాఖ్యానించారు. తొలి విడత గెలిచినప్పుడు జనాల కోసం తాపత్రయపడ్డానని ఈసారి మాత్రం కార్యకర్తల కోసం సమయం కేటాయిస్తానని అన్నారు. జనాలకు మంచి చేసే సమయంలో కార్యకర్తలకు కొద్దిపాటి అన్యాయం జరిగిన విషయం వాస్తవమేనని కానీ ఈసారి తన పరిపాలన వేరే లెవెల్ లో ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కథను గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. తనపై టీడీపీ – కాంగ్రెస్ కలిసి అక్రమంగా కేసులు పెట్టినప్పుడు వాటిని తట్టుకుని ఎలా బయటపడ్డానో ఇప్పటికీ అదే ఆత్మవిశ్వాసం తనలో ఉన్నట్లు చెప్పారు. ప్రజలు అంతా గమనిస్తూ ఉంటారని.. తనపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడితే.. తిరిగి వచ్చి ప్రజల ఆశీస్సులతో సీఎం అయ్యానని తెలిపారు.

కూటమి ప్రభుత్వం చెప్పిన సూపర్ సిక్స్ గురించి అడుగుతుంటే రెడ్ బుక్ రాజ్యాంగం బయటకు తీస్తోందని ఆరోపించారు. మేనిఫెస్టోలో చెప్పిన పథకాలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తించుకోవాలని అన్నారు. కార్యకర్తలపై ఇప్పుడు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ల పాటు తానే అధికారంలో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.

సినిమా

ఆరుగురు నన్ను లైంగికంగా వేధించారు.. వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలనం..

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. కొన్ని సార్లు ఇండస్ట్రీలో కాకుండా బయట కూడా తాము ఎదుర్కున్న...

రామ్ చరణ్‌ బర్త్ డే గిఫ్ట్ రెడీ.. ఆ రెండు పోస్టర్లు...

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ బర్త్ డేకి రెండు గిఫ్ట్ లు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్‌ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాలో చాలా బిజీగా...

రాజకీయాలు ఎన్నికల వరకే, ప్రభుత్వం శాశ్వతం : లోకేష్‌

ఎన్నికల సమయం వరకే రాజకీయాలు చేయాలని, ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే పరిపాలన అస్తవ్యస్తం గా మారుతుందని మంత్రి నారా లోకేష్‌...

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది:...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు...

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

రాజకీయం

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

బూతులు లేవు, బాధ్యతలు మాత్రమే.! కూటమి సర్కారుకి జన నీరాజనం.!

అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని...

కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ ప్రకంపనలు..

కర్ణాటక రాజకీయాలను హనీట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. కేవలం అధికార పార్టీనే కాకుండా అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కర్ణాటక సహకార మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా...

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

ఎక్కువ చదివినవి

త్వరలో గుడ్‌ న్యూస్ వింటారు : లోకేష్‌

వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుంటు పడిందని మంత్రి లోకేష్ మండలిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందని లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు...

బల ప్రదర్శనతో వైఎస్ జగన్ ఏం సాధిస్తారు.?

మొన్న గుంటూరు మిర్చియార్డు సందర్శన సందర్భంగా పోటెత్తిన జన సందోహం.! నిన్న కూడా ఓ వివాహ వేడుకకి హాజరైతే, అక్కడా జన సంద్రం.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

యూఎస్ లోని ఫ్లోరిడాలో కార్ యాక్సిడెంట్.. అత్త, కోడలు, కొడుకు మృతి..

అమెరికాలో ముగ్గురు తెలుగు వారు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఫ్లోరిడాలో కార్ యాక్సిడెంట్ జరగ్గా.. ఇందులో ముగ్గురు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకుల పల్లికి చెందిన మాజీ...

బిగ్ క్వశ్చన్: రాజకీయ నేరాల్ని కూటమి ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందా.?

జనసేన నేతలు, కార్యకర్తలపై దాడులు.! బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! దాడులు చేస్తున్నదేమో వైసీపీ నేతలు, కార్యకర్తలు.! ఇదేమీ వైసీపీ హయాం కాదు.! అప్పట్లో అయితే, పైన చెప్పుకున్న...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 21 మార్చి 2025

పంచాంగం తేదీ 21-03-2025, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ సప్తమి రా. 11.50 వరకు నక్షత్రం:...