భారత్ లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అక్టోబర్ నాటికి రావొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా తీవ్రత, రాబోయే రోజుల్లో కరోనా ప్రభావంపై జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో రాయిటర్స్ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని వెల్లడించారు. జూన్ 3 నుంచి 17 మధ్య జరిపిన ఈ సర్వేలో 40 మందికి పైగా నిపుణులు, వైరాలజిస్టులు, వైద్యులు పాల్గొన్నారు. 24 మంది నిపుణుల్లో థర్డ్ వేవ్ అక్టోబర్ నాటికి వస్తుందని 21 మంది చెప్పారు. మరో ముగ్గురు నవంబర్-ఫిబ్రవరి మధ్య రావొచ్చని తెలిపారు. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ తో ఈ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా చెప్పారు.
థర్డ్ వేవ్ లో పిల్లలపై ప్రభావం ఎక్కువనే అభిప్రాయాన్ని 26 మంది చెప్పుకొచ్చారు. 14 మంది మాత్రం పిల్లలపై ప్రభావం ఉండదనే చెప్పారు. అయితే.. 18ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. భవిష్యత్తులో కొత్త కరోనా వేరియంట్లు వచ్చిన ప్రస్తత వ్యాక్సినేషన్ వల్ల పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చని 25 మంది అభిప్రాయపడ్డారు. మొత్తంగా కరోనా వైరస్ ముప్పు మరో ఏడాది వరకూ ఉండొచ్చని 31 మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అక్టోబర్ నాటికి వ్యాక్సినేషన్ ఎక్కువమందకి అందడం.. సెకండ్ వేవ్ వల్ల రోగనిరోధకత ఇందుకు సాయపడుతుందని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు.
వ్యాక్సినేషన్, కరోనా బారిన పడటం వల్ల వచ్చే రెండేళ్లలో భారత్ హెర్డ్ ఇమ్యూనిటీ సాధిస్తుందని అంతర్జాతీయ వైరాలజీ నిపుణుడు రాబర్ట్ గల్లో అభిప్రాయపడ్డారు. థర్డ్ వేవ్ లో పిల్లలకు వైరస్ సోకినా తీవ్రత తక్కువే అని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు ఇటివలే చెప్పారు. అయితే.. చిన్నారులకు వైరస్ ప్రమాదం ఉందని ఆసుపత్రుల్లో ఐసీయూ పడకలు తక్కువగా ఉండటం ఓ కారణమని కర్ణాటక ప్రభుత్వ సలహాదారు డాక్టర్ దేవిశెట్టి అంటున్నారు.
438239 756601Wonderful artical, I unfortunately had some problems printing this artcle out, The print formating looks just a little screwed over, something you might want to look into. 2885