Switch to English

8 రోజుల్లో రాజా సాబ్… ఇంకా దూరమే గమ్యం!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,172FansLike
57,764FollowersFollow

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ మధ్య తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. రిలీజ్ అయినప్పటి నుంచి నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ, స్టార్ పవర్ కారణంగా థియేటర్లలో కలెక్షన్లు నిలబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి హాలిడే అడ్వాంటేజ్ సినిమాకు కొంతవరకు కలిసివచ్చింది.

ఎనిమిదో రోజు కల్లా సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టింది. కనుమ పండుగ సందర్భంగా ప్రేక్షకుల రాక కొంత పెరగడంతో, ఆ రోజు ఓ మోస్తరు హోల్డ్ కనిపించింది. అయితే సినిమా బడ్జెట్, అంచనాలు దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటివరకు వచ్చిన వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదో రోజు దాదాపు 2.03 కోట్ల షేర్ వసూలు చేయగా, వరల్డ్ వైడ్‌గా 2.73 కోట్ల షేర్, 5.40 కోట్ల గ్రాస్ సాధించింది. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది రోజులకు గానూ సినిమా సాధించిన వసూళ్లు చూస్తే –
నైజాంలో 29.95 కోట్లు, సీడెడ్‌లో 9.93 కోట్లు, యూఏలో 9.58 కోట్లు, ఈస్ట్‌లో 7.54 కోట్లు, వెస్ట్‌లో 5.24 కోట్లు, గుంటూరులో 5.16 కోట్లు, కృష్ణాలో 5.24 కోట్లు, నెల్లూరులో 3.34 కోట్లు వసూలు చేసింది.
ఇవన్నీ కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 75.98 కోట్ల షేర్ (112.25 కోట్ల గ్రాస్) నమోదైంది. ఇతర భాషల్లో చూస్తే కర్ణాటకలో 8.42 కోట్లు, తమిళనాడు + కేరళలో 1.60 కోట్లు, హిందీ బెల్ట్‌లో సుమారు 12.10 కోట్లు, ఓవర్సీస్‌లో 16.90 కోట్లు వసూలయ్యాయి. దీంతో వరల్డ్ వైడ్‌గా సినిమా ఇప్పటివరకు 115 కోట్ల షేర్ (సుమారు 192.90 కోట్ల గ్రాస్) ను నమోదు చేసింది.

అయితే సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకా దాదాపు 94 కోట్ల షేర్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ట్రెండ్ చూస్తే అది అంత సులువు కాదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్, వీకెండ్ అడ్వాంటేజ్, కొన్ని సెంటర్లలో మంచి ఆక్యుపెన్సీ కారణంగా రాబోయే రోజుల్లో కలెక్షన్లు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి మిక్స్డ్ టాక్ మధ్య కూడా ‘రాజా సాబ్’ తన రన్ కొనసాగిస్తోంది. కానీ భారీ టార్గెట్‌ను చేరుకోవాలంటే ఇకపై స్ట్రాంగ్ హోల్డ్ తప్పనిసరి అనే అభిప్రాయం బాక్స్ ఆఫీస్ వర్గాల్లో వినిపిస్తోంది.

సినిమా

విజయ్–రష్మిక పెళ్లి వివరాలు లీక్? కుటుంబాలకు తలనొప్పి

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో లీక్ అవుతుండటం కలకలం రేపుతోంది. పెళ్లి తేదీ, వేదిక,...

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ వైరల్..! ఎవరిని ఉద్దేశించి ఆ...

Dil Raju: ‘నేటి రోజుల్లో నిర్మాతకు విలువలేద’ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎవరిని ఉద్దేశించి ఆయన...

మే 1న పిల్లల కోసం ‘సమ్మర్ హాలిడేస్’.. థియేటర్లలోకి రాబోతున్న కొత్త...

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధీరజ్ మొగిలినేని, తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త చిత్రాన్ని...

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న...

హే బల్‌వంత్‌పై భారీ అంచనాలు.. సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న...

బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది....

రాజకీయం

హిందూపురం బాలిక కేసులో కీలక మలుపు: ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్, ఇద్దరు నిందితులు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో మూడు రోజుల క్రితం బయటపడిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోవర్ధన్...

Breaking News: బొత్సపై హెరిటేజ్ లీగల్ నోటీసు..

అమరావతి: తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్...  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు...

నారా లోకేష్ మీద దుష్ప్రచారం.! పరువు పోగొట్టుకున్న వైఎస్సార్సీపీ.!

కోటి రూపాయల ప్రజాధనాన్ని నారా లోకేష్ దుర్వినియోగం చేసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ పరువుని బజార్న పడేసింది. ఇటీవల కొలంబోలో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య...

ఫలితాల దిశగా కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ నీటి నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల్లో కీలకమైన నీటి భద్రత దిశగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లా గట్టి...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

ఎక్కువ చదివినవి

ఫీజు బకాయిలపై వైసీపీకి లోకేష్ సవాల్

అమరావతిలో జరిగిన శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...

డిన్నర్ టేబుల్‌పై ఆత్మీయ వాతావరణం.. లోకేష్ కొత్త వ్యూహం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పార్టీ బలోపేతం కోసం కొత్త తరహా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, క్యాడర్‌కు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశంతో...

ఈ వారం ఓటీటీల్లో ఎంటర్‌టైన్‌మెంట్ వర్షం!

ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్య ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వరుసగా విడుదలకు వస్తుండటంతో డిజిటల్ ప్రేక్షకులకు వినోదోత్సవం మొదలైంది. సంక్రాంతికి థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన...

బడ్జెట్‌తో స్వర్ణాంధ్ర 2047 దిశగా 360° అభివృద్ధికి బలమైన పునాది వేసాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి తీసుకెళ్లే దిశగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి 360 డిగ్రీల సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

వ్యవసాయానికి పెద్దపీట: రైతు సంక్షేమంపై 2026–27 బడ్జెట్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2026–27 వ్యవసాయ బడ్జెట్‌లో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు డిప్యూటీ సీఎంఓ అధికారికంగా వెల్లడించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆహార భద్రత, మార్కెట్‌లో ధరల...