Switch to English

వైఎస్ జగన్ హెచ్చరికలపై కూటమి అప్రమత్తమవ్వాల్సిందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,956FansLike
57,764FollowersFollow

ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, ‘మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడతాం..’ అని ప్రస్తుత ప్రభుత్వాన్ని నడుపుతున్నవారిపై హెచ్చరికలు చేస్తోంటే, అధికారంలో ఇప్పుడున్నవాళ్ళు ఏం చెయ్యాలి.?

అంటే, వైఎస్ జగన్ హెచ్చరికల్ని పరిగణనలోకి తీసుకుని, కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఇప్పటికిప్పుడు కక్ష సాధింపు చర్యలు షురూ చేయాలన్నమాట. ‘ప్రతీదీ గుర్తు పెట్టుకోండి.. వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం..’ అని వైసీపీ నేతలు, కార్యకర్తల్ని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం, ఇప్పటిదాకా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. ఒకవేళ కక్ష సాధింపు చర్యల్ని కూటమి ప్రభుత్వం మొదలు పెడితే, ఈపాటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైల్లో వుండాలి. ఎందుకంటే, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ‘స్కిల్ డెవలప్మెంట్ స్కామ్’ అంటూ, లేని స్కామ్‌ని చంద్రబాబు మీద బలవంతంగా రుద్ది, జైలుకు పంపించారు వైఎస్ జగన్.

నారా లోకేష్‌ని అరెస్టు చేయించడానికి వైఎస్ జగన్ అప్పట్లో చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. జనసేనాని పవన్ కళ్యాణ్ మీద కూటా కుట్రపూరిత వ్యవహారాలు చాలానే నడిపారు వైఎస్ జగన్. ఓ దశలో పవన్ కళ్యాణ్‌ని విశాఖలో అరెస్టు చేయించేందుకు జగన్ చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అవి బెడిసి కొట్టాయి.

వైసీపీ హయాంలో టీడీపీ కావొచ్చు, జనసేన కావొచ్చు, బీజేపీ కావొచ్చు..ప్రజల తరఫున నినదించే పరిస్థితే వుండేది కాదు. ఏ పార్టీ అయినా నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటే, పోలీసులు అడగుడుగునా ఆటంకాలు సృష్టించడం చూశాం. హౌస్ అరెస్టులు సర్వసాధారణం. జగన్ హెలికాప్టర్‌లో వెళుతోంటే, కింద రోడ్డు మీద ట్రాఫిక్ నిలిపేసిన ఘటనలూ లేకపోలేదు.

వాటన్నిటికన్నా దారుణమైన విషయం, ముఖ్యమంత్రిగా జగన్ వున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా క్యాంప్ కార్యాలయం దగ్గర నిరసన తెలిసిన విద్యార్థుల మీద అత్యాచారయత్నం కేసులు పెట్టిన ఘనత అప్పటి పోలీసు యంత్రాంగానిది.

అంతలా దుర్మార్గ పాలన చేసి, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీలపై వైఎస్ జగన్ ‘మేం అధికారంలోకి వచ్చాక మీ అంతు తేలుస్తాం..’ అని హెచ్చరిస్తున్నారంటే, జగన్ హెచ్చరికను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సిందే.

‘జగన్ మళ్ళీ గెలిచేది లేదు.. అతని తాటాకు చప్పుళ్ళకు బెదరం..’ అని కూటమి ప్రభుత్వం లైట్ తీసుకుంటే కష్టం. ఎందుకంటే, అధికారంలో లేకపోయినా, వైసీపీ ‘వ్యవస్థల్ని’ మేనేజ్ చేయగలుగుతోందన్న ఆవేదన కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తల మీద వుంది.

‘కొన్ని చోట్ల పోలీసులు వైసీపీ నేతల మాటలు విని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు’ అంటూ టీడీపీ, జనసేన బీజేపీకి చెందిన కింది స్థాయి నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వ పెద్దలు ఒకింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందే.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇలా బెదిరింపుకు దిగడం మాత్రం అత్యంత దారుణం.! చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు, ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత దారుణ పరాజయాన్ని చవిచూశాక కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్; రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరించడాన్ని ఏమనుకోవాలి.?

సినిమా

అఖండ 2 విడుదల వాయిదా: అర్ధరాత్రి మేకర్స్ ప్రకటనతో అభిమానుల...

అర్ధరాత్రి సమయంలో అఖండ 2 మేకర్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనివార్య కారణాల వల్ల చిత్రం నిర్ణయించిన...

BIGG BOSS 9 TELUGU E89: తొలి ఫైనలిస్ట్ కోసం దుమ్ము...

బిగ్ బాస్ సీజన్ 9 గురువారం ఎపిసోడ్ 89 లో  ఇంట్లో అల్లరి, ఆగ్రహం, డ్రామా, పోటీ అన్నీ పీక్‌కు చేరుకున్నాయి. తొలి ఫైనలిస్ట్‌ కోసం...

“కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” ట్రైలర్ రిలీజ్

“కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమా ట్రైలర్ హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో విడుదలైంది. సుమలీల సినిమా బ్యానర్‌పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ, స్వయంగా...

డేంజర్‌లో టాప్ కంటెస్టెంట్! బిగ్ బాస్ తెలుగు 9 ఓటింగ్‌లో షాకింగ్...

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ చివరి దశలోకి దూసుకెళ్తుండగా ఓటింగ్ పిక్చర్ పూర్తిగా మారిపోయింది. ఇక షో ముగిసేందుకు మూడు వారాలే ఉండటంతో హౌస్‌లో...

మెగా–వెంకీ మ్యాజిక్: మన శంకరవరప్రసాద్ గారు సెట్స్‌పై భావోద్వేగ క్షణాలు!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుండి ఒక హైలైట్ అప్‌డేట్ బయటకు వచ్చింది. విక్టరీ...

రాజకీయం

ప్రజలకు చేరువగా ఉండే పాలన కోసం డీడీఓ విప్లవం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువయ్యేలా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు గురువారం ముఖ్య మైలురాయి ఏర్పడింది. చిత్తూరులో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసు (డీడీఓ) కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్...

పవన్ కళ్యాణ్ విజయం కోసం తెలంగాణ యువకుని దీక్ష…

తెలంగాణ జగిత్యాల జిల్లా కొండగట్టుకు చెందిన యువకుడు చట్టా సతీష్, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపట్ల తనకున్న ఆరాధనను నిరూపించుకున్న హృదయాన్ని హత్తుకునే సంఘటన బుధవారం జరిగింది. ప్రజారాజ్యం రోజుల్లో...

ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం… పవన్ కల్యాణ్ యాక్షన్ ప్లాన్ ప్రకటన

ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సంపూర్ణ ప్రణాళికతో ముందుకు సాగుతుందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంచేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప్పాడ మత్స్యకారులతో ప్రత్యేక...

హెలికాప్టర్‌ పడిపోవాలి అన్న నాని వ్యాఖ్యలతో వైసీపీ శాడిజం బట్టబయలు: బొలిశెట్టి శ్రీనివాస్

సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ హెలికాప్టర్లు, విమానాల్లో ప్రయాణిస్తే అవి పడిపోవాలనే పేర్ని నాని వ్యాఖ్యలు వైసీపీ నేతల శాడిజం, నీచ బుద్ధిని స్పష్టంగా బయటపెడుతున్నాయని...

గ్రామాల్లో కొత్త ఆవిష్కరణ‌ల‌కు ప్రభుత్వం అండ: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ స్థాయిలోనే కొత్త ఆవిష్కరణలను వెలికితీసి, వాటికి భద్రత, ప్రోత్సాహం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ, పర్యావరణ, శాస్త్ర–సాంకేతిక శాఖ మంత్రి...

ఎక్కువ చదివినవి

పవన్ దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం, క్షమాపణలు కోరుతూ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ‘తెలంగాణ దిష్టి’ వ్యాఖ్యలు భారీ వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మరియు కాంగ్రెస్ ప్రముఖ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...

ఏపీకి కొత్త దిశ… చంద్రబాబు ‘3 జోన్’ పాలసీతో సమగ్ర అభివృద్ధి లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. పాలనాపరమైన మార్పులకు పేరు పొందిన చంద్రబాబు, రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా—ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, రాయలసీమ—విభజించి, మూడు ప్రత్యేక ప్రాంతీయ...

ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్: ఆనంద్–వైష్ణవి జంట నుంచి వింటర్ ట్రీట్

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.32కి ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అనే ఆకట్టుకునే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘బేబీ’ తరువాత మరొకసారి ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న...

అమరావతిలో 15 బ్యాంకుల శంకుస్థాపన… లోకేష్ వ్యాఖ్యలు హాట్ టాపిక్

అమరావతి మరోసారి అభివృద్ధి వేగాన్ని అందుకుంది. అమరావతిలో ఒక్కరోజులోనే 15 జాతీయ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం...

Daily Horoscope: డిసెంబర్ 1, 2025 – సోమవారం రాశిఫలాలు

మేషం (Aries): ఈరోజు మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో వేగంగా ముందుకు వెళ్లగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో చిన్న లాభాలు వస్తాయి. స్నేహితులతో కలిసే...