Switch to English

వైఎస్ జగన్ హెచ్చరికలపై కూటమి అప్రమత్తమవ్వాల్సిందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,861FansLike
57,764FollowersFollow

ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, ‘మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడతాం..’ అని ప్రస్తుత ప్రభుత్వాన్ని నడుపుతున్నవారిపై హెచ్చరికలు చేస్తోంటే, అధికారంలో ఇప్పుడున్నవాళ్ళు ఏం చెయ్యాలి.?

అంటే, వైఎస్ జగన్ హెచ్చరికల్ని పరిగణనలోకి తీసుకుని, కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఇప్పటికిప్పుడు కక్ష సాధింపు చర్యలు షురూ చేయాలన్నమాట. ‘ప్రతీదీ గుర్తు పెట్టుకోండి.. వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం..’ అని వైసీపీ నేతలు, కార్యకర్తల్ని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం, ఇప్పటిదాకా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. ఒకవేళ కక్ష సాధింపు చర్యల్ని కూటమి ప్రభుత్వం మొదలు పెడితే, ఈపాటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైల్లో వుండాలి. ఎందుకంటే, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ‘స్కిల్ డెవలప్మెంట్ స్కామ్’ అంటూ, లేని స్కామ్‌ని చంద్రబాబు మీద బలవంతంగా రుద్ది, జైలుకు పంపించారు వైఎస్ జగన్.

నారా లోకేష్‌ని అరెస్టు చేయించడానికి వైఎస్ జగన్ అప్పట్లో చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. జనసేనాని పవన్ కళ్యాణ్ మీద కూటా కుట్రపూరిత వ్యవహారాలు చాలానే నడిపారు వైఎస్ జగన్. ఓ దశలో పవన్ కళ్యాణ్‌ని విశాఖలో అరెస్టు చేయించేందుకు జగన్ చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అవి బెడిసి కొట్టాయి.

వైసీపీ హయాంలో టీడీపీ కావొచ్చు, జనసేన కావొచ్చు, బీజేపీ కావొచ్చు..ప్రజల తరఫున నినదించే పరిస్థితే వుండేది కాదు. ఏ పార్టీ అయినా నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటే, పోలీసులు అడగుడుగునా ఆటంకాలు సృష్టించడం చూశాం. హౌస్ అరెస్టులు సర్వసాధారణం. జగన్ హెలికాప్టర్‌లో వెళుతోంటే, కింద రోడ్డు మీద ట్రాఫిక్ నిలిపేసిన ఘటనలూ లేకపోలేదు.

వాటన్నిటికన్నా దారుణమైన విషయం, ముఖ్యమంత్రిగా జగన్ వున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా క్యాంప్ కార్యాలయం దగ్గర నిరసన తెలిసిన విద్యార్థుల మీద అత్యాచారయత్నం కేసులు పెట్టిన ఘనత అప్పటి పోలీసు యంత్రాంగానిది.

అంతలా దుర్మార్గ పాలన చేసి, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీలపై వైఎస్ జగన్ ‘మేం అధికారంలోకి వచ్చాక మీ అంతు తేలుస్తాం..’ అని హెచ్చరిస్తున్నారంటే, జగన్ హెచ్చరికను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సిందే.

‘జగన్ మళ్ళీ గెలిచేది లేదు.. అతని తాటాకు చప్పుళ్ళకు బెదరం..’ అని కూటమి ప్రభుత్వం లైట్ తీసుకుంటే కష్టం. ఎందుకంటే, అధికారంలో లేకపోయినా, వైసీపీ ‘వ్యవస్థల్ని’ మేనేజ్ చేయగలుగుతోందన్న ఆవేదన కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తల మీద వుంది.

‘కొన్ని చోట్ల పోలీసులు వైసీపీ నేతల మాటలు విని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు’ అంటూ టీడీపీ, జనసేన బీజేపీకి చెందిన కింది స్థాయి నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వ పెద్దలు ఒకింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందే.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇలా బెదిరింపుకు దిగడం మాత్రం అత్యంత దారుణం.! చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు, ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత దారుణ పరాజయాన్ని చవిచూశాక కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్; రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరించడాన్ని ఏమనుకోవాలి.?

సినిమా

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

టచ్ చేశావ్ కిరణ్..!

తను ఎదుగుతూ మరో పదిమంది ఎదగడానికి సహాయం చేయడం అన్నది చాలా గొప్ప విషయం. తాను అనుభవించిన కష్టం తెలుసు కాబట్టి మరొకరు ఆ కష్టం...

రాజకీయం

స్టూడెంట్స్ లో మార్పు కోసం గుంజీలు తీసిన హెచ్ ఎం.. అభినందించిన లోకేష్

ఏపీ విద్యాశాఖలో మార్పుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులను కొట్టడం ద్వారా కాకుండా బుద్ధులు నేర్పించడం ద్వారా మార్చాలనేది విద్యాశాఖ ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా...

పోసాని బ్లాక్‌మెయిల్ చేస్తే, న్యాయస్థానం బెయిల్ ఇస్తుందా.?

నోటికొచ్చిందల్లా వాగితే, రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ళల్లోని చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు తెగబడతానంటూ రెచ్చిపోతే.. వ్యవస్థలు ఊరుకుంటాయా.? ఎప్పుడూ తామే అధికారంలో వుంటాం కాబట్టి, ఎలాంటి రాక్షసత్వానికైనా తెగబడొచ్చనుకుంటే కుదురుతుందా.? కుదరదు, ఇది ప్రజాస్వామ్యం. సినీ...

చంద్రబాబుని ఏకాకిని చేద్దామనుకున్న జగన్.! తానే చివరికి ఏకాకిగా మిగిలిపోయె.!

చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో, ఆయన్ని ఏకాకిగా మార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయాల్లో రాజకీయ యెత్తుగడల్ని తప్పు పట్టలేంగానీ.. వైఎస్ జగన్ అనుసరించిన...

ఏ-2 విజయ సాయి రెడ్డి మనసెందుకు విరిగిపోయింది.?

వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి, ‘నా మనసు విరిగిపోయింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘మీకే మనసు విరిగిపోయిందంటే, మా పరిస్థితి ఏంటి.?’ అని కొందరు వైసీపీ...

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌.. రంగంలోకి ACB..!

వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాలో కోట్ల అవకతవకలపై ACB విచారణకు సిద్ధమైంది ప్రభుత్వం. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో జరిగిన అవకతవకలు, ఆరోపణలపై సమగ్ర విచారణ జరగనుంది. ఎన్నికల ముందు ఏపీలోని యువ...

ఎక్కువ చదివినవి

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్ మీట్లో దిల్ రాజు

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈమేరకు వివరాలు...

పోసాని బ్లాక్‌మెయిల్ చేస్తే, న్యాయస్థానం బెయిల్ ఇస్తుందా.?

నోటికొచ్చిందల్లా వాగితే, రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ళల్లోని చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు తెగబడతానంటూ రెచ్చిపోతే.. వ్యవస్థలు ఊరుకుంటాయా.? ఎప్పుడూ తామే అధికారంలో వుంటాం కాబట్టి, ఎలాంటి రాక్షసత్వానికైనా తెగబడొచ్చనుకుంటే కుదురుతుందా.? కుదరదు, ఇది ప్రజాస్వామ్యం. సినీ...

వైకాపా ఫీజు పోరుపై లోకేష్ ధ్వజం

శాసన మండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులపై వైకాపా వాయిదా తీర్మానానికి పట్టుబట్టింది. మండలి ఛైర్మన్‌ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో వైకాపా సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. ఛైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు....

ప్రణయ్ హత్య కేసు సంచలన తీర్పు..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ళ ప్రణయ్ హత్య కేసులో నేడు నల్గొండ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ2 అయిన ముద్దాయి సుభాష్ కు ఉరిశిక్ష...

చంద్రబాబుని ఏకాకిని చేద్దామనుకున్న జగన్.! తానే చివరికి ఏకాకిగా మిగిలిపోయె.!

చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో, ఆయన్ని ఏకాకిగా మార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయాల్లో రాజకీయ యెత్తుగడల్ని తప్పు పట్టలేంగానీ.. వైఎస్ జగన్ అనుసరించిన...