ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రానున్న “థాంక్యూ డియర్”

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,071FansLike
57,764FollowersFollow

మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో పప్పు బాలాజీ రెడ్డి నిర్మించిన, తోట శ్రీకాంత్ కుమార్ రచన-దర్శకత్వంలో రూపొందిన “థాంక్యూ డియర్” చిత్రం ఆగస్టు 1న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా, “తంత్ర” మూవీ ఫేమ్ ధనుష్ రఘుముద్రి హీరోగా, రేఖ నిరోషా మరో ముఖ్య పాత్రలో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు వరల్డ్ బర్నింగ్ ఇష్యూను చూపించారు.

ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రానున్న “థాంక్యూ డియర్”

ఈ సినిమా విడుదలకు ముందే హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ 50వ వార్షికోత్సవంలో ప్రత్యేక ప్రదర్శన జరగడమే కాక, 15వ గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడిగా తోట శ్రీకాంత్ అవార్డు అందుకున్నారు. హెబ్బా పటేల్ ఉత్తమ నటి అవార్డు, నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి డెబ్యూ ప్రొడ్యూసర్ అవార్డు, నాగ మహేష్ మరియు రేఖ నిరోషా సహాయ నటీనటుల అవార్డులు గెలుచుకున్నారు. అలాగే బెంగళూరు ఇండియా ఆర్ట్ అండ్ లిటరేచర్ అసోసియేషన్, వెస్ట్ బెంగాల్ వెల్రెడ్ అసోసియేషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించాయి. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.

ఈ చిత్రంలో రవి ప్రకాశ్, నాగ మహేష్, వీర శంకర్, ఛత్రపతి శేఖర్, మీనాకుమారి, బేబీ ప్రభావతి, బలగం సుజాత, సంక్రాంతి శ్రీనివాస్ నాయుడు, వీనిషా, వర్దిని, పప్పు చందు తదితరులు నటించగా, పిఎల్కే రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. సంగీతం సుభాష్ ఆనంద్ అందించారు.

ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో దర్శకుడు శ్రీకాంత్ తోట మాట్లాడుతూ, “మీడియా వారు మొదటి నుండి ఇచ్చిన సపోర్ట్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా ప్రపంచంలో జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్ ఆధారంగా కుటుంబం మొత్తం చూసేలా రూపొందించాం. ఇప్పటికే సినిమాకు వచ్చిన అవార్డులు మా బృందానికి గర్వకారణం. నిర్మాత బాలాజీ గారు ఇచ్చిన సహాయం మరువలేనిది” అన్నారు.

నిర్మాత బాలాజీ మాట్లాడుతూ, “ఆగస్టు 1న విడుదల కాబోతున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. మా టీమ్ అందరూ అద్భుతంగా పని చేశారు” అని తెలిపారు.

హీరో ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ, “నా తొలి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు. హెబ్బా పటేల్, రేఖ నిరోషా గార్లతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకుల మద్దతు మాకు తప్పక లభిస్తుంది” అన్నారు.

హీరోయిన్ రేఖ నిరోషా మాట్లాడుతూ, “ఈ సినిమా నా కెరీర్‌లో ప్రత్యేకమైనది. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పారు.

లైన్ ప్రొడ్యూసర్ పునీత్ మాట్లాడుతూ, “మా చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.

సంగీత దర్శకుడు సుభాష్ మాట్లాడుతూ, “డైరెక్టర్ శ్రీకాంత్, నిర్మాత బాలాజీ గారు ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే మేము మంచి మ్యూజిక్ అందించగలిగాము” అని అన్నారు.

“థాంక్యూ డియర్” ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా

“సీట్ ఎడ్జ్ సస్పెన్స్… ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై దర్శకుడు మునిరాజు నమ్మకం”

హీరో Kiran Abbavaram న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ...

“ఫస్ట్ హాఫ్ లాక్… అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ట్!”

దర్శకుడు Anil Ravipudi తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథనం దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్...

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

రాజకీయం

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

ఎక్కువ చదివినవి

“‘అమరావతిని అజరామరం చేశారు’ : నారా లోకేష్”

ఆంధ్రప్రదేశ్ రాజధాని Amaravatiకు చట్టబద్ధ గుర్తింపు లభించడం రాష్ట్ర చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ చారిత్రక బిల్లుపై సంతకం చేసిన Droupadi Murmuకు మంత్రి Nara Lokeshతో పాటు ఎన్డీఏ ఎంపీలు...

#ఎన్‌టిఆర్‌నీల్‌లో డాన్స్ ట్విస్ట్?

ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే మాస్ ఎలివేషన్స్, పవర్‌ఫుల్ యాక్షన్, హై ఇంటెన్స్ డ్రామా అన్నదే ముందుగా గుర్తుకు వస్తుంది. కానీ ఆయన సినిమాల్లో హీరోల కోసం ప్రత్యేకంగా డాన్స్ నంబర్లు ప్లాన్...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్...

వైఎస్‌ డెత్ మిస్టరీ మళ్లీ హాట్ టాపిక్..! బాణం జగన్ వైపేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఈ ఘటనను గత 15 ఏళ్లుగా రాజకీయంగా వాడుకున్న తీరు ఇప్పుడు తిరిగి అదే...

యువతకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ మెసేజ్

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఇప్పుడు విస్తృత చర్చకు దారి తీసింది. ముఖ్యంగా...