మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మిస్తున్న “థాంక్యూ డియర్” సినిమాకు తోట శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖ నిరోషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, చత్రపతి శేఖర్, బలగం సుజాత, సంక్రాంతి శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి పి.ఎల్.కె. రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పాటను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విడుదల చేయగా, టీజర్ను దర్శకుడు వివి వినాయక్ లాంచ్ చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది.
ట్రైలర్లో ఇద్దరు అమ్మాయిల మధ్య ఇరుక్కుపోయే ఒక యువకుడి కథను చూపించారు. ఇప్పటికే రేఖ నిరోషాతో పెళ్లయిన హీరో ధనుష్, హెబ్బా పటేల్తో ప్రేమలో పడే సన్నివేశాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ట్రైలర్లోని డైలాగులు హాస్యంతో పాటు ట్రెండ్కు తగ్గట్లుగా ఉండగా, బిజిఎం సినిమాకు ప్లస్ అవుతుందని అనిపిస్తోంది. అలాగే విజువల్స్ చూస్తుంటే నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఇప్పటివరకు చూసిన ప్రేమ కథలకు భిన్నంగా సస్పెన్స్తో కూడిన కొత్త కథను ఈ సినిమా అందించబోతోందని ట్రైలర్ సూచిస్తోంది. మరి ఈ “థాంక్యూ డియర్” సినిమా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో తెలుసుకోవాలంటే ఆగస్టు 1న
