Switch to English

తండేల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ అదుర్స్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,845FansLike
57,764FollowersFollow

నాగ చైతన్య సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ కాగా ట్రైలర్ కూడా అంచనాలు పెంచేసింది. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ మూవీగా చెప్పుకుంటున్న తండేల్ బిజినెస్ విషయంలో కూడా అదరగొట్టేసింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించారు.

తండేల్ సినిమా నాన్ థియేట్రిక బిజినెస్ ఇప్పటి వరకు నాగ చైతన్య కెరీర్ లో ది బెస్ట్ అని తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ 35 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఆడియో రైట్స్ రూపంలో 7 కోట్ల దాకా వచ్చాయని తెలుస్తుంది. తెలుగు సినిమాలకు హిందీలో మార్కెట్ ఎక్కువగా ఉంది. అందుకే తండేల్ హిందీ రైట్స్ కోసం 8 కోట్ల దాకా ఛార్జ్ చేసినట్టు సమాచారం.

ఇవే కాకుండా శాటిలైట్స్ రూపంలో కూడా తండేల్ సినిమాకు మరో 10 కోట్లు వచ్చినట్టు చెబుతున్నారు. మొత్తంగా 60 కోట్ల దాకా నాన్ థియేట్రికల్ రైట్స్ తో తండేల్ అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ చేసింది. తండేల్ సినిమా 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని తెలుస్తుంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే 60 కోట్లు తీసుకురాగా మిగిలిన 30 కోట్లు థియేట్రికల్ బిజినెస్ తో రాబట్టాల్సి ఉంటుంది. సినిమాకు ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. తండేల్ సినిమాకు ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా నాగ చైతన్య ఖాతాలో సరికొత్త రికార్డులు వచ్చి చేరేలా ఉన్నాయి.

సినిమా

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

రాజకీయం

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

ఎక్కువ చదివినవి

అప్పుడు విజన్ 2020.. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ @2047..!

తమ పరిపాలన విధి విధానాలతో అభివృద్ధిని కళ్లలు కట్టినట్టు చూపించడం కొంతమంది నాయకులకే సాధ్యపడుతుంది. అలాంటి ప్రజా నాయకులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన...

విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు కూటమి ప్రయత్నం.. మొదటిసారి ట్రూడౌన్..!

ట్రూడౌన్.. అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధానం. ఇది గత ఐదేళ్లలో ఎన్నడూ వినిపించలేదు. ఎంత సేపు ట్రూ అప్ మాత్రమే వినిపించింది. ట్రూ అప్ అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమే తప్ప...

జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్ర ప్రదేశ్ : పవన్ కళ్యాణ్

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైట్ రేట్ సాధించిన తర్వాత జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ సభను జయప్రదం...

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..!

చట్టాలు ఎన్నొచ్చినా.. ఎన్ని రకాల శిక్షలు ప్రవేశ పెట్టినా.. ప్రభుత్వం ఎన్ని రకాలుగా మహిళా సంరక్షణ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినా ఎక్కడో ఒకచోట.. ఏదో ఒకరంగా వాళ్లని హింసిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...