Switch to English

జానీ మాస్టర్ కేసు విచారణ.. కమిటీ వేసిన ఫిల్మ్ ఛాంబర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,947FansLike
57,764FollowersFollow

ఇప్పుడు టాలీవుడ్ లో దుమారం రేపుతున్న జానీ మాస్టర్ కేసుపై ఒక్కొక్కరుగా అందరూ స్పందిస్తున్నారు. ఇక ఇండస్ట్రీ తరఫున ఫిల్మ్ ఛాంబర్స్ అసోసియేషన్ ఆఫ్ కామర్స్ కూడా స్పందించింది. బాధితురాలు తమకు ముందే ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. 2018లో తాము ఏర్పాటు చేసిన లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ లో సదరు బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు. మహిళా కొరియోగ్రాఫర్ నుంచి వచ్చిన ఫిర్యాదును తాము స్వీకరించామని.. ఈ కేసును పరిష్కరించడానికి కమిటీని వేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉన్నట్టు వారు తెలిపారు.

ఇక జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి కూడా ఈ కేసు విచారణ తేలే వరకు తొలగిస్తున్నట్టు ప్రకటించింది ఫిల్మ్ ఛాంబర్స్. ఇక తాము ఏర్పాటు చేసిన కమిటీలో K.L. దామోదర్ ప్రసాద్, Hon. సెక్రటరీ & కన్వీనర్ గా.. ఝాన్సీ చైర్‌పర్సన్ గా ఉన్నట్టు తెలిపారు. వీరితో పాటు అంతర్గత సభ్యులుగా తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది ఉన్నారు. ఇక బాహ్య సభ్యులుగా రామలక్ష్మి మేడపాటి, సామాజిక కార్యకర్త మరియు మీడియా నిపుణురాలు ఉన్నారు. ఆమెతో పాటు లాయర్ కావ్య మండవ కూడా ఉన్నారు.

ఇక మీదట కూడా ఇండస్ట్రీలో ఎవరికైనా మహిళలకు ఇబ్బందులు కలిగితే ఈ ప్యానెల్ కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం బయట ఫిర్యాదుల పెట్టె ఉంటుందని.. దీనిని ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య యాక్సెస్ చేయవచ్చని వారు తెలిపారు. ఒకవేళ ఇక్కడి వరకు వచ్చి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని వారు పోస్టు ద్వారా కూడా పంపొచ్చని వారు తెలిపారు.

సినిమా

గుర్రం పాపిరెడ్డి: సహజమైన కామెడీతో ప్రేక్షకులను అలరించే చిత్రం – డైరెక్టర్...

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో రూపొందిన “గుర్రం పాపిరెడ్డి” ఈ నెల 19న థియేటర్లకు రానుంది. డార్క్ కామెడీ జానర్‌లో, కొత్త కాన్సెప్ట్‌తో...

Chiranjeevi: ‘చిరంజీవి’ స్థాయి, స్థానమేంటో చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Chiranjeevi: చిరంజీవి.. ‘ఈ పేరే చాలా పవర్ ఫుల్ కదా’ అని దేవిశ్రీ ప్రసాద్ తనతో అన్నాడని దర్శకుడు సుకుమార్ ఓ సందర్భంలో అన్నారు. నిజమే...

శక్తివంతమైన ‘అఖండ 2’ గ్రాండ్ రిలీజ్ టీజర్ గూస్‌బంప్స్..

మాస్ మంత్రం, భక్తి వైభవం కలగలిపిన ‘అఖండ 2: ది తాండవం’ టీజర్ ప్రేక్షకుల్లో ఆతృతను మరింత పెంచింది. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానున్న...

BIGG BOSS 9 TELUGU E95: తనూజనే కప్ కొట్టాలని కోరుకున్న...

బిగ్ బాస్ సీజన్ 9 బుధవారం ప్రసారమైన 95వ ఎపిసోడ్ పూర్తిగా రచ్చ, టాస్క్ ట్విస్ట్‌లు, ఇంటి సభ్యుల మధ్య హీటెడ్ చర్చలతో అదిరిపోయింది. రోజు...

“వింటేజ్ మాస్ మేనియాను మళ్లీ తీసుకొస్తున్నాం!” — హీరో కార్తి

స్టార్ హీరో కార్తి నటిస్తున్న ‘అన్నగారు వస్తారు’ ఈ నెల 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్...

రాజకీయం

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి రోడ్ల అభివృద్ధిపై కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు

క్యాబినెట్ సమావేశం ప్రారంభానికి ముందు పలు మంది మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తమ నియోజకవర్గాల రహదారి నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం...

పరకామణిలో దొంగతనం.! మరింతగా దిగజారిపోతున్న వైసీపీ ఇమేజ్.!

రవికుమార్ అనే వ్యక్తి, పరకామణిలో దొంగతనం చేస్తూ, దొరికిపోయాడు.! దాదాపు డెబ్భయ్ వైల రూపాయల విలువ చేసే, అమెరికన్ డాలర్లను రవికుమార్ దొంగతనం చేసినట్లు తేలింది. పాప పరిహారం కింద, దాదాపు 14...

చిన్నారి క్యాన్సర్ చికిత్సకు లోకేష్ అండ: రూ.12 లక్షల సాయం

అమరావతి: చదువుకోవాల్సిన వయసులో బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న అనంతపురం చిన్నారి చికిత్స కోసం మంత్రి నారా లోకేష్ ముందుకు వచ్చారు. 12 ఏళ్ల కె. చిన్నికృష్ణ ఉదయ్ పవన్ కుమార్‌కు సీఎం రిలీఫ్...

దేశంలో హిందువులే మెజారిటీ అనే భావన అసత్యం: పవన్ కళ్యాణ్

మంగళగిరిలో జాతీయ మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశంలో హిందువులే మెజారిటీ అన్న భావన అసత్యమని స్పష్టం చేశారు. కులం, భాష, ప్రాంతాల వారీగా హిందూ సమాజం విభజితమైందని, ఈ...

ప్రమోషన్ల ఆనందం ప్రజాసేవలో కనిపించాలి: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం కేవలం అధికారిక కార్యక్రమం కాదని, అది వారి కుటుంబాల్లో పండుగ వాతావరణం తీసుకువచ్చే ముఖ్యమైన సందర్భమని అన్నారు....

ఎక్కువ చదివినవి

దేశంలో హిందువులే మెజారిటీ అనే భావన అసత్యం: పవన్ కళ్యాణ్

మంగళగిరిలో జాతీయ మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశంలో హిందువులే మెజారిటీ అన్న భావన అసత్యమని స్పష్టం చేశారు. కులం, భాష, ప్రాంతాల వారీగా హిందూ సమాజం విభజితమైందని, ఈ...

అఖండ 2 – వీరమల్లు రచ్చ ఎందుకు? బాలయ్య–పవన్ పోలికపై హాట్ టాక్

‘అఖండ’ తర్వాత భారీ క్రేజ్‌తో ఎదురు చూసిన ‘అఖండ 2 తాండవం’ చివరి నిమిషంలో వాయిదా పడడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు పెద్ద ఎత్తున మళ్లీ ముదిరాయి. ప్రత్యేకంగా, ఎంతో కాలం నిర్మాణంలో...

వచ్చేస్తున్నాడు: అఖండ 2 రిలీజ్ కి మార్గం క్లియర్‌… కానీ..

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2కి సంబంధించిన రిలీజ్ డ్రామా చివరకు కీలక మలుపు తీసుకుంది. మద్రాస్ హైకోర్టు రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో చిత్ర బృందం ఊపిరి...

ఆంధ్రుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం: డల్లాస్‌లో లోకేష్ హామీ

అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రవాసాంధ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆంధ్రుల కోసం ప్రభుత్వం మరింత బాధ్యతతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కష్టకాలాల్లో ప్రవాసాంధ్రులు...

అమరావతిలో క్వాంటమ్ రీసెర్చ్ హబ్‌కు రిగెట్టి సహకారం కోరిన లోకేష్

అమరావతిని అంతర్జాతీయ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనను కొనసాగిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో రిగెట్టి కంప్యూటింగ్ సిటిఓ డేవిడ్ రివాస్‌ను ఆయన...