ప్రపంచం మొత్తం కూడా కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. జమ్మూ కాశ్మిర్లో ఉగ్రవాదులు భారత జవాన్లపై విరుచుకు పడటంతో పాటు చంపేందుకు కుట్ర పన్నుతున్నారు. తాజాగా జమ్మూ కశ్మీర్ లో కుల్గాం హింజిపొరలోని ఒక ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం అందుకున్న ఆర్మీ మరియు పోలీసులు అక్కడకు వెళ్లి హెచ్చరికలు జారీ చేశారు.
ఆ సమయంలో లొంగి పోకపోవడంతో పాటు ఆర్మీ జవాన్లపై ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు ప్రయత్నించారు. దాంతో ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసినట్లుగా ఆర్మీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. హింజిపొరలో ఇంకా ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో ఆర్మీ ఉన్నతస్థాయి అధికారులతో అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్లో ఒక జవాన్కు స్వల్ప గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఉగ్రవాదులను చాకచక్యంతో ఆర్మీ జవాన్లు ఎన్కౌంటర్ చేసినట్లుగా తెలుస్తోంది.
900000 564993Black Ops Zombies is now available […]Take a appear here[…] 227864