వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో ఆయన మాజీ డ్రైవర్ మృతదేహం లభ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో వాస్తవాలు తెలుసుకునేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఈరోజు కాకినాడలోని జీజీహెచ్ లోని మార్చురీ గదికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య తోపులాటతోపాటు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
దీంతో జీజీహెచ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈసందర్భంగా జరిగిన తోపులాటలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు గాయపడ్డారు. ఆయన్ను జీజీహెచ్లోకి తీసుకెళ్లి వైద్యం అందించారు. మరోవైపు సుబ్రహ్మణ్యం మృతదేహానికి ఇంకా పోస్టుమార్టం నిర్వహించలేదు. ఎమ్మెల్సీని అరెస్ట్ చేసే వరకూ సంతకం చేయమని అతని కుటుంబసభ్యులు చెప్పడంతో పోస్టుమార్టం నిలిచిపోయింది. మరోవైపు కేసు విషయంలో తమపై ఎటువంటి ఒత్తిడులూ లేవని కుటుంబసభ్యులు సంతకాలు చేసి పోస్టుమార్టం జరిగేలా చూడాలని పోలీసులు కోరుతున్నారు
241130 431308I believe this internet site contains quite superb composed articles posts . 427462
13530 304518Woh I enjoy your content material , saved to favorites ! . 481686