ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్కి మరో ప్రముఖ నిర్మాత పీవీపీకి మధ్య ‘టెంపర్’ సినిమా చిచ్చు పెట్టింది. ఇదిప్పటి గొడవ కాదు, చాలాకాలంగా నడుస్తున్నదే. ‘టెంపర్’ సినిమాకి పీవీపీ ఫైనాన్స్ చేశారట. ఆ ఫైనాన్స్కి సంబంధించి బకాయి పడ్డ 7 కోట్ల విషయమై ఇప్పుడు గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పీవీపీకి తాను ఇవ్వాల్సిందేమీ లేదని బండ్ల గణేష్ చెబుతున్నారు. కానీ, పీవీపీ మాత్రం తనకు రావాల్సిన బకాయిల గురించి అడుగుతోంటే, బండ్ల గణేష్ ఇవ్వకపోగా.. అనుచరులతో బెదిరిస్తున్నాడని పీవీపీ ఆరోపిస్తుండడం గమనార్హం. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది.
తాను పోలీసులకు నిన్న సాయంత్రమే పీవీపీ గురించి ఫిర్యాదు చేశానని బండ్ల గణేష్ చెప్పడమే కాదు, తనను చంపేందుకు పీవీపీ మనుషులు తన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారని సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. సినీ పరిశ్రమలో ఇలాంటి వివాదాలు తరచూ చూస్తూనే వుంటాం. పైగా, పీవీపీ మీద ఇలాంటి ఆరోపణలు కొత్తేమీ కాదు. అదే సమయంలో బండ్ల సైతం ఇలాంటి వివాదాలతో సావాసం చేస్తుంటాడనుకోండి.. అది వేరే సంగతి.
ప్రస్తుతం పీవీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా వున్నారు. బండ్ల గణేష్ గతంలో కాంగ్రెస్లో పనిచేసినా, ఇప్పుడాయన రాజకీయాలకు దూరంగా వున్నారు. సినీ నిర్మాణ వ్యవహారాలు పక్కన పెట్టేసి, చాలాకాలం తర్వాత తిరిగి యాక్టింగ్పై ఫోకస్ పెట్టారు బండ్ల గణేష్. మహేష్ హీరోగా నటిస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో బండ్ల గణేష్ నటిస్తోన్న విషయం విదితమే. కాగా, బండ్ల గణేష్ తెలంగాణలో జనసేన పగ్గాలు చేపడ్తారంటూ ప్రచారం జరుగతున్న వేళ, పీవీపీ రగడ.. రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది.
626090 979208Hi! I discovered your web site accidentally today, but am genuinely pleased that we did! Its not only entertaining, but in addition straightforward to make use of in contrast to lots that Ive viewed! 258304