Switch to English

హస్తినకు తెలుగు సీఎంలు.. కారణాలేంటో?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

తెలుగు ముఖ్యమంత్రులు అకస్మాత్తుగా హస్తినబాట పడుతుండటం.. వేర్వేరుగా ప్రధాని మోదీతో సమావేశం కానుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఏ ముఖ్యమంత్రైనా ప్రధానిని కలవడం, తమ రాష్ట్ర సమస్యలపై విన్నవించడం మామూలే. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ వరుసగా ఒకరి తర్వాత మరొకరు ప్రధాని మోదీతో సమావేశం కానుండటం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.

జగన్ ఇప్పటికే పలుమార్లు ప్రధానిని కలిసినా.. కేసీఆర్ మాత్రం కలవలేదు. ఆయన రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మర్యాదపూర్వకంగా మోదీని కలిశారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో కేంద్రంలోని బీజేపీ పెద్దలతో కేసీఆర్ కి దూరం పెరిగింది. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను కలిసేందుకు కేసీఆర్ పలుమార్లు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా ప్రధానిని ఆహ్వానించలేదు. అనంతరం కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే రీతిలో టీఆర్ఎస్ వ్యవహరించింది.

ఈ నేపథ్యంలో దాదాపు 9 నెలల తర్వాత కేసీఆర్ కు శుక్రవారం ప్రధాని అపాయింట్ మెంట్ లభించడం ఆసక్తి కలిగిస్తోంది. అకస్మాత్తుగా కేసీఆర్ కి మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వడానికి ఏదో బలమైన కారణం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి, కృష్ణా నదీజలాలను అనుసంధాలించాలనే లక్ష్యంలో ఇరువురు సీఎంలు ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో కేంద్రం మదిలో మరో ఆలోచన ఉందని, ఈ నేపథ్యంలోనే ఇరువురు సీఎంలను పిలిచి మోదీ మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

అందువల్లే 9 నెలల విరామం తర్వాత కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ సైతం అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. రాష్ట్ర సమస్యలు ప్రస్తావించడంతోపాటు ఆర్థికసాయం కోరనున్నారని తెలుస్తోంది. ఇక ఏపీ సీఎం జగన్ శనివారం ప్రధానితో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రైతుభరోసా పథకం ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించనున్నారు. అలాగే పలు అంశాలపై ప్రధానికి వినతులు ఇవ్వనున్నారు. రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చరణ్, నేనూ...