ఫిదా సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ అమ్మడు సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానం కలుగుతుంది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలకు పైగా చేస్తూ బిజీ బిజీగా ఉండాల్సిన ఈ సమయంలో సాయి పల్లవి కనీసం ఒక్క సినిమా కూడా చేయడం లేదు. ఆమె వద్దకు వెళ్లిన ప్రతి నిర్మాతకు నో చెబుతుందట.
వెళ్లిన ప్రతి నిర్మాతకు నో చెబుతుండటంతో సాయి పల్లవిని ఈమధ్య కాలంలో ఏ ఒక్క నిర్మాత కూడా సంప్రదించలేదని సమాచారం అందుతుంది. గత ఏడాది ఆమెను ప్రముఖ హీరోల కోసం ముగ్గురు నలుగురు దర్శక నిర్మాతలు సంప్రదించారని, కానీ ఏ ఒక్క సినిమాకు ఆమె ఓకే చెప్పలేదని సమాచారం అందుతుంది.
సాయి పల్లవి సినిమాలు చేయడం లేదు అంటూ ఒక ప్రచారం మొదలవడంతో దర్శక నిర్మాతలు ఆమెను కలవడం కూడా మానేశారట. లేడీ పవర్ స్టార్ అంటూ టాలీవుడ్ అభిమానులు సాయి పల్లవిని పిలుచుకుంటున్నారు. అంతటి అభిమానం చూపుతున్నా కూడా సాయి పల్లవి మాత్రం తెలుగు సినిమాలపై ఆసక్తి చూపడం లేదు.