Switch to English

మోడీ సూచనని తెలుగు మీడియా పాటిస్తుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ దెబ్బకి ప్రపంచమంతా విలవిల్లాడుతున్న వేళ, ఆ ‘వైరస్‌’ని సాకుగా చూపి, కొన్ని మీడియా సంస్థలు ‘దుర్మార్గానికి’ ఒడిగట్టాయి. గత కొంతకాలంగా ‘కాస్ట్‌ కటింగ్‌’ దిశగా అడుగులేస్తోన్న సదరు మీడియా సంస్థలకి ‘కరోనా వైరస్‌’ భలేగా కలిసొచ్చినట్టుంది. అడ్డగోలుగా ఉద్యోగుల్ని తొలగించేసి, ఆ నెపాన్ని ‘కరోనా’ మీదకు నెట్టేశాయి.

సభ్య సమాజానికి నీతులు చెప్పే మీడియా సంస్థలే ఇలాంటి దిగజారుడు చర్యలకు దిగడం పట్ల బాధిత జర్నలిస్టులు సోషల్‌ మీడియా వేదికగా తమ ఆవేదనను వెల్లగక్కుతున్న విషయం విదితమే. ఇదిలా వుంటే, తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ‘కరోనా పేరు చెప్పి ఉద్యోగుల్ని తొలగించవద్దు..’ అంటూ ఓ విజ్ఞప్తి చేశారు. మొత్తంగా ‘ఏడు’ అంశాల్ని ప్రస్తావించారు నరేంద్ర మోడీ ఈ రోజు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో. అందులో ‘ఆరవది’ ‘ఉద్యోగుల్ని తొలగించద్దు’ అని వుంది.

‘ఈ ఏడు సూత్రాలు పాటిస్తే.. కరోనాపై విజయం సాధించగలం..’ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయాన్ని దాదాపుగా అన్ని మీడియా సంస్థలూ హైలైట్‌ చేశాయి. కానీ, చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి డాష్‌ డాష్‌.. అన్నట్లు వ్యవహరిస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. నిజానికి, అన్ని రంగాలకూ ఇబ్బంది ఏర్పడినట్లే, మీడియా రంగానికి కూడా కరోనా సెగ గట్టిగానే తగిలింది. దీన్ని కాదనడానికి వీల్లేదు.

అయితే, మీడియా రంగానికి రాత్రికి రాత్రి వచ్చిన పెను నష్టమైతే లేదు. ఏ మీడియా సంస్థా ఓ నెల, రెండు మూడు నెలల సంక్షోభాన్ని తట్టుకోలేనంత అధమైమన ఆర్థిక ప్లానింగ్‌తో వుండదు. ఏం చేసినా, ‘కరోనా కాలంలో’ కొట్టుకుపోతుందన్న ‘సంకుచిత’ ఆలోచనలే ఈ సమస్యకి కారణం. ‘కరోనాని బూచిగా చూపి తమను రోడ్డున పడేయొద్దు’ అంటూ బాధిత జర్నలిస్టులు నెత్తీనోరూ బాదుకుంటున్నా సదరు యాజమాన్యాలకు చీమకుట్టినట్లైనా వుండడంలేదు.

ఆల్‌ ఇండియా న్యూస్‌ పేపర్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ తరఫున బాధిత ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధమవుతున్న దరిమిలా.. ఈ విషయమై కేంద్రం స్పందిస్తుందా.? రాష్ట్రాలు జర్నలిస్టుల ఆవేదనను అర్థం చేసుకుంటాయా.? వేచి చూడాల్సిందే.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

రాజకీయం

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎక్కువ చదివినవి

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...