మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని హెలీప్యాడ్కు ఆదివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, అలాగే తిరుగు ప్రయాణంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విచ్చేశారు. వీరు ఓ ప్రయివేటు కార్యక్రమం కోసం హెలికాప్టర్లో మంగళగిరి చేరుకున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, పార్టీ నాయకులు వారిని ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం మంగళగిరిలో జరిగిన ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు తిరుగు ప్రయాణానికి ముందు పవన్ కళ్యాణ్ పంపిన కొండపల్లి బొమ్మలతో కూడిన జ్ఞాపికలు అందుకున్నారు.
ఈ స్వాగత, వీడ్కోలు కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

