కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచీ గట్టి చర్యలే చేపట్టింది. లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ పదేపదే స్పష్టం చేస్తూ వచ్చారు. రెండోసారి లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కూడా ఆయన గట్టి వైఖరే కనబరిచారు. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు.. ఆర్థికంగా నష్టపోతే అప్పో సప్పో చేసి పూడ్చుకోవచ్చు అని చాలాసార్లు చెప్పారు.
లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కేంద్రాని కంటే కాస్త ముందుకే ఉంటున్నారు. జనతా కర్ఫ్యూ ఒకరోజు పాటించాలని మోదీ పిలుపునిస్తే.. రెండు రోజులు చేద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. లాక్ డౌన్ రెండో విడతను మే 4 వరకు కేంద్రం పొడిగిస్తే.. తెలంగాణలో ఈనెల 7 వరకు పొడిగించారు. ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు ఇవ్వొచ్చని కేంద్రం వెసులుబాటు కల్పిస్తే.. రాష్ట్రంలో అలాంటివి వేటికీ ఆయన అనుమతించలేదు. తాజాగా కేంద్రం లాక్ డౌన్ ను మే 17 వరకు ప్రకటించగా.. 21 వరకు దీనిని పొడిగించే యోచనలో కేసీఆర్ ఉన్నారు.
పైగా సడలింపుల విషయంలోనూ ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సడలింపులు ఇవ్వాలా, వద్దా? ఇస్తే ఎలా ఇవ్వాలి వంటి అంశాలపై సుదీర్ఘంగా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ఇలా లాక్ డౌన్ విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న తెలంగాణ సర్కారు.. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఎక్కువయ్యాయి.
కరోనా నిర్ధారణ పరీక్షలు సరిగా చేయడంలేదని, నమోదైన కేసులను తక్కువ చేసి చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే మరణాల సంఖ్యను సైతం సరిగా వెల్లడించడంలేదని అంటున్నారు. కేంద్రం నుంచి మూడు రోజుల పర్యటకు వచ్చిన బృందం తన పర్యటనను పొడిగించుకోవడానికి కారణం ఇక్కడి లెక్క తేల్చడానికేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సంగతిని మంత్రి ఈటల రాజేందర్ ని అడిగితే తాము కేసులను దాచిపెట్టడంలేదని పేర్కొన్నారు. ఎడాపెడా పరీక్షలు చేయకుండా కేవలం వైరస్ చైన్ తెగ్గొట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. నిజానికి తెలంగాణలో సెకండరీ కాంటాక్టు కేసులకు పరీక్షలు నిర్వహించడంలేదని చాలామంది వైద్య సిబ్బంది చెబుతున్నారు. సూర్యాపేటలో కేసుల సంఖ్య భారీగా పెరగడానికి ఇదే కారణమని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఎలాంటి లక్షణాలూ లేకపోయినా కరోనా పాజిటివ్ గా తేలుతున్న తరుణంలో.. ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించడం మంచిదని సూచిస్తున్నారు. లేకుంటే అలాంటివారంతా గుప్తవాహకాలుగా కరోనా వ్యాప్తి మరింత ప్రబలడానికి అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత దారుణ పరిస్థితులు చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంలో ముందుంటున్న తెలంగాణ సర్కారు.. పరీక్షల విషయంలో కూడా ఇంతే కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
528326 858223I genuinely enjoyed this. It was incredibly educational and beneficial. I will return to examine on upcoming posts 863475
935968 328870I discovered your weblog internet website on bing and appearance several of your early posts. Preserve up the quite excellent operate. I just now additional the RSS feed to my MSN News Reader. Seeking toward reading far much more on your part down the road! 66528
100104 51020Excellent paintings! This is the kind of information that ought to be shared around the internet. Disgrace on Google for now not positioning this publish upper! Come on over and speak over with my internet site . Thanks =) 953898