Switch to English

తెలంగాణలో లెక్క తక్కువ చూపిస్తున్నారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచీ గట్టి చర్యలే చేపట్టింది. లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ పదేపదే స్పష్టం చేస్తూ వచ్చారు. రెండోసారి లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కూడా ఆయన గట్టి వైఖరే కనబరిచారు. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు.. ఆర్థికంగా నష్టపోతే అప్పో సప్పో చేసి పూడ్చుకోవచ్చు అని చాలాసార్లు చెప్పారు.

లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కేంద్రాని కంటే కాస్త ముందుకే ఉంటున్నారు. జనతా కర్ఫ్యూ ఒకరోజు పాటించాలని మోదీ పిలుపునిస్తే.. రెండు రోజులు చేద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. లాక్ డౌన్ రెండో విడతను మే 4 వరకు కేంద్రం పొడిగిస్తే.. తెలంగాణలో ఈనెల 7 వరకు పొడిగించారు. ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు ఇవ్వొచ్చని కేంద్రం వెసులుబాటు కల్పిస్తే.. రాష్ట్రంలో అలాంటివి వేటికీ ఆయన అనుమతించలేదు. తాజాగా కేంద్రం లాక్ డౌన్ ను మే 17 వరకు ప్రకటించగా.. 21 వరకు దీనిని పొడిగించే యోచనలో కేసీఆర్ ఉన్నారు.

పైగా సడలింపుల విషయంలోనూ ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సడలింపులు ఇవ్వాలా, వద్దా? ఇస్తే ఎలా ఇవ్వాలి వంటి అంశాలపై సుదీర్ఘంగా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ఇలా లాక్ డౌన్ విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న తెలంగాణ సర్కారు.. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఎక్కువయ్యాయి.

కరోనా నిర్ధారణ పరీక్షలు సరిగా చేయడంలేదని, నమోదైన కేసులను తక్కువ చేసి చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే మరణాల సంఖ్యను సైతం సరిగా వెల్లడించడంలేదని అంటున్నారు. కేంద్రం నుంచి మూడు రోజుల పర్యటకు వచ్చిన బృందం తన పర్యటనను పొడిగించుకోవడానికి కారణం ఇక్కడి లెక్క తేల్చడానికేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే సంగతిని మంత్రి ఈటల రాజేందర్ ని అడిగితే తాము కేసులను దాచిపెట్టడంలేదని పేర్కొన్నారు. ఎడాపెడా పరీక్షలు చేయకుండా కేవలం వైరస్ చైన్ తెగ్గొట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. నిజానికి తెలంగాణలో సెకండరీ కాంటాక్టు కేసులకు పరీక్షలు నిర్వహించడంలేదని చాలామంది వైద్య సిబ్బంది చెబుతున్నారు. సూర్యాపేటలో కేసుల సంఖ్య భారీగా పెరగడానికి ఇదే కారణమని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఎలాంటి లక్షణాలూ లేకపోయినా కరోనా పాజిటివ్ గా తేలుతున్న తరుణంలో.. ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించడం మంచిదని సూచిస్తున్నారు. లేకుంటే అలాంటివారంతా గుప్తవాహకాలుగా కరోనా వ్యాప్తి మరింత ప్రబలడానికి అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత దారుణ పరిస్థితులు చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంలో ముందుంటున్న తెలంగాణ సర్కారు.. పరీక్షల విషయంలో కూడా ఇంతే కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

వైసీపీ వద్దే వద్దు: ఉత్తరాంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్‌కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.? ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...