‘‘కరోనా మహమ్మారిని ఎదుర్కొనేంత సాధన సంపత్తి మనదేశంలో లేవు. అందువల్ల లాక్ డౌన్ ముమ్మాటికీ పాటించాల్సిందే. మన తీసుకునే ముందు జాగ్రత్త చర్యలే మనకు శ్రీరామ రక్ష’’ – ఇటీవల పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి. లాక్ డౌన్ పొడిగింపు విషయంలో గానీ, రైళ్లను నడొపద్దని చెప్పడంలో గానీ ఆయనే ముందున్నారు. లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కేంద్రాని కంటే నాలుగు రోజులు ముందుకే ఉండేవారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాట్లను సైతం తెలంగాణలో అమలు చేయలేదు. కానీ ప్రస్తుతం చాలా విషయాల్లో సడలింపులు ఇచ్చేశారు. కరోనాతో కలిసి జీవించక తప్పదని పలుమార్లు స్పష్టంచేసిన గులాబీ బాస్.. కేంద్ర మార్గదర్శకాల మేరకు పలు ఆంక్షలను ఎత్తివేశారు.
తెలంగాణలోని నాలుగైదు జిల్లాలు మినహా ప్రస్తుతం ఎక్కడా కేసులు నమోదు కావడంలేదు. దీంతో ఆయా జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు కూడా తిప్పుతున్నారు. అయితే, రాష్ట్రమంతా రాత్రివేళ కర్ఫ్యూ మాత్రం యథాతథంగా ఉంటుందని.. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు కూడా ఆ లోపలే తమ ట్రిప్పులు ముగించుకుని వచ్చేలా షెడ్యూల్ రూపొందించుకోవాలని సూచించారు. తాజాగా ఇందులోనూ మినహాయింపు ఇచ్చారు. ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ వర్తించదని ప్రకటించారు. అంతేకాకుండా రాత్రి వేళ బస్టాండ్ల నుంచి ఆటోలు, ట్యాక్సీలు తిరగడానికి కూడా అనుమతించారు. దీంతో బస్సులు తిరిగే జిల్లాల్లో కర్ఫ్యూ దాదాపు లేనట్టే. రెండు నెలల తర్వాత రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సుల ఆదాయం పెంపొందించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ప్రస్తుతం హైదరాబాద్ లో కేసులు ఇంకా నమోదవుతుండటంతో సిటీ బస్సులను అనుమతించలేదు. అలాగే వ్యాపార సముదాయాలను సరి-బేసి పద్ధతిలో తెరుచుకునేందుకు అనుమతించారు. తాజాగా వాటి విషయంలోనూ సడలింపులు ఇచ్చారు. మాల్స్ లో ఉన్న షాపులు మినహా మిగిలిన షాపులన్నీ యథావిధిగా తెరుచుకోవచ్చు. తక్కువ షాపులు ఉంటే ఎక్కువ మంది గుమిగూడే అవకాశం ఉంటుందనే భావనతో ప్రస్తుతం అన్ని షాపులూ తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినట్టు ప్రకటించారు. మరోవైపు ఈనెల కూడా వేతన జీవికి నిరాశ తప్పదు. మే నెల జీతాల్లో కూడా కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రతినిధులకు 75 శాతం, అఖిల భారత సర్వీసు అధికారులకు 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం, పింఛనుదారులకు 25 శాతం కోత విధించనున్నారు.
526378 112803Some genuinely nice stuff on this website , I enjoy it. 612449