“ఇది ఎగ్జిబిటర్ల బ్రతుకు పోరాటం”.. పర్సెంటేజ్ షేరింగ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక డిమాండ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,669FansLike
57,764FollowersFollow

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, పరిరక్షణ కోసం “పర్సెంటేజ్ షేరింగ్ విధానం”ను అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మరోసారి గట్టిగా డిమాండ్ చేసింది. ఈ అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ ఎగ్జిబిటర్ సభ్యుల సమావేశంలో నిర్మాతలు చదలవాడ శ్రీనివాస్, శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్‌తో పాటు పలువురు ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వారు ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలు కీలక విషయాలను వెల్లడించారు.

నిర్మాత చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో నిర్మాత తండ్రిలాంటి వాడైతే, ఎగ్జిబిటర్ బిడ్డలాంటివాడని అన్నారు. తండ్రి ఎంత కష్టపడినా బిడ్డల సుఖం కోసమే కష్టపడతాడని, అలాగే పరిశ్రమలో ఎగ్జిబిటర్ల పరిస్థితి మెరుగుపడితేనే ఇండస్ట్రీ కూడా బాగుంటుందని చెప్పారు. గత 20 ఏళ్లుగా ఎగ్జిబిటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా గత ఆరు నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారిందని పేర్కొన్నారు. ఎగ్జిబిటర్లను బ్రతికించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య సమన్వయం చాలా అవసరమని అన్నారు. థియేటర్ల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సునీల్ నారంగ్, శిరీష్ రెడ్డి వంటి వారికి నిర్మాతగా తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ.. పర్సెంటేజ్ విధానం కోసం చేస్తున్న పోరాటాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. ఇది ఏ సినిమా లేదా నిర్మాతను టార్గెట్ చేయడం కాదని, కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నమని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే పర్సెంటేజ్ విధానం అమలులో ఉండగా, తెలుగులో మాత్రం రెంటల్ విధానంలో సినిమాలు విడుదల చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఎగ్జిబిటర్ల పరిస్థితిని మరో కోణంలో చూడవద్దని, థియేటర్లను రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రేక్షకులకు టికెట్ రేట్లు పెంచే ఉద్దేశం లేదని కూడా స్పష్టం చేశారు.

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ.. పర్సెంటేజ్ విధానం కోసం 2008 నుంచే పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. ‘హరిహర వీరమల్లు’ విడుదల సమయంలో కూడా ఈ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చినా అది జరగలేదన్నారు. థియేటర్లు బంద్ చేస్తున్నామని జరుగుతున్న ప్రచారం అసత్యమని, పర్సెంటేజ్ ఇచ్చే సినిమాలను మాత్రం ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. గీత, వెంకటేశ్వర, సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని, మరికొన్ని సంస్థలు కూడా త్వరలో ఈ విధానంలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇదే విధానం అమలులో ఉందని, తమకు ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపారు. అయితే పర్సెంటేజ్ విధానం లేకపోతే థియేటర్లను నడపడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ఇది చాలా సీరియస్ సమస్య అని అన్నారు. పర్సెంటేజ్ విధానం అమలు చేస్తామని చెబుతున్నా, ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని పేర్కొన్నారు. నిర్మాతలు కూడా ప్రస్తుతం నష్టాల్లోనే ఉన్నారని చెప్పారు. మల్టీప్లెక్సుల్లో ఆధునిక టెక్నాలజీలు, కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నా, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అలాంటి మార్పులు తీసుకురాలేకపోతున్నామని తెలిపారు. డాల్బీ వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సింగిల్ స్క్రీన్స్‌కి వస్తారని చెప్పారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోతారని హెచ్చరించారు. చాలా ఏళ్లుగా ఈ సమస్యను నిర్మాతల దృష్టికి తీసుకెళ్తున్నామని, హామీలు మాత్రమే వస్తున్నాయని అన్నారు. అందుకే ఈ సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని చెప్పారు. మీడియా కూడా థియేటర్ల పరిరక్షణ కోసం తమకు సహకరించాలని కోరారు.

 

సినిమా

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్...

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే...

పెద్ది దూకుడు కొనసాగుతోంది.. 11వ రోజు ఆల్‌టైమ్ టాప్-6లో ఎంట్రీ!

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదలైన 11వ రోజు ఏపీ-తెలంగాణలో...

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు....

బుచ్చిబాబు క్షమాపణలపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు.. ఆసక్తికర చర్చకు దారితీసిన స్పందన

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన వివాదం నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చేసిన క్షమాపణలపై ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ స్పందించారు. ఈ విషయంపై...

రాజకీయం

తప్పుడు ప్రచారమా?.. డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. డీఎస్సీ నియామకాల్లో కుల ప్రాధాన్యతకు సంబంధించిన ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ వర్గాల్లో వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద జరిగిన...

దేశ సమగ్రతే జనసేన లక్ష్యం.. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ

ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ నిర్వహించిన ‘సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం’ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి...

సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం: ఢిల్లీలో జనసేన కీలక సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. "సేన ప్రస్థానం... జాతీయ...

తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష...

డీఎస్సీ వివాదం.. లోకేశ్‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీపై రాజకీయ చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, కూటమి...

ఎక్కువ చదివినవి

పరామర్శకు వెళ్లిన లోకేష్.. ఆస్పత్రి వద్ద రాజకీయ వివాదం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రి నారా లోకేష్ కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లిన సందర్భంగా రాజకీయ వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆరోపణలు ప్రస్తుతం...

ఈడీ దూకుడు.. ఏపీ లిక్కర్ కేసులో కీలక అరెస్టులు, సోదాలు

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ సరఫరా వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు వేగం పెంచింది. మద్యం రవాణా, సరఫరా ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో...

పెద్ది దూకుడు కొనసాగుతోంది.. 11వ రోజు ఆల్‌టైమ్ టాప్-6లో ఎంట్రీ!

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదలైన 11వ రోజు ఏపీ-తెలంగాణలో రూ.4.67 కోట్ల షేర్ వసూలు చేసి...

Chiranjeevi: ‘ఆయన తెలుగు సినిమా భీష్మాచార్యుడు’.. ‘సింగ్ గీతం’కు చిరంజీవి ప్రశంస

Chiranjeevi: ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావును తెలుగు సినిమా భీష్మాచార్యుడిగా అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సింగ్ గీతం’. మరో స్టార్ డైరక్టర్ నాగ్ అశ్విన్ ఈ...

సంధ్య థియేటర్ కేసులో కోర్టు కీలక ఆదేశాలు.. ప్రచారంపై తాత్కాలిక ఆంక్షలు

సంధ్య థియేటర్ కేసులో కోర్టు కీలక ఆదేశాలు..  థియేటర్‌కు సంబంధించిన వివాదంలో హైదరాబాద్ నగర సివిల్ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. O.S. No.216 of 2026లో I.A. No.369...