Adipurush: ప్రభాస్ (Prabhas) శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ (Adipurush) సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా ప్రదర్శించే ప్రతి ధియేటర్లో ఓ సీటు హనుమంతుడి కోసం రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) .. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో 10వేలకు పైగా టికెట్లు ఉచితంగా ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇందుకు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సోషల్ మీడియాలో ఇచ్చిన లింక్ లో గూగుల్ ఫారమ్ పూర్తి చేయాలి. సందేహాల కోసం 95050 34567 నెంబరుకు సంప్రదించాలని కోరారు.
‘శ్రీరాముడి ప్రతి అధ్యాయం సర్వ మానవాళికి ఓ పాఠం. ఈ తరం ఆయన గురించి తెలుసుకోవాలి.. ఆయన అడుగుజాడల్లో నడవాల్సి ఉంద’ని పేర్కొంది. ఆదిపురుష్ సినిమాకి దళితులకు ప్రవేశంలేదనే ప్రచారం అవాస్తవమని యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది. కులం, వర్ణం, మతం.. ఎటువంటి వివక్షతను చూపకుండా సర్వ సమానత్వం వైపు నిలిచేదే ఆదిపురుష్ అని.. ఇటువంటి చెడు ప్రచారాల్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. ఈనెల 16న ఆదిపురుష్ విడుదల కానుంది.