టీడీపీకి వేరే శతృవులు అక్కర్లేదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,407FansLike
57,764FollowersFollow

ఔను, తెలుగు దేశం పార్టీకి వేరే శతృవులు అక్కర్లేదు. టీడీపీ అను‘కుల’ మీడియా, టీడీపీకి చెందిన కొందరు కార్యకర్తలు, టీడీపీకే చెందిన కొందరు కుహనా మేథావులు.. వీళ్ళు చాలు.. తెలుగు దేశం పార్టీ సర్వనాశనమైపోవడానికి.

వైసీపీ కంటే ఎక్కువగా పైన చెప్పుకున్న ఓ మూక, టీడీపీని అదఃపాతాళానికి తొక్కేసే పనిలో చాలా చాలా బిజీగా వుంది. లేకపోతే, సోషల్ మీడియా వేదికగా ‘స్పేస్‌’లు పెట్టి మరీ, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించడమేంటి.? అలా నినదిస్తున్నవారిలో, కొందరు ‘అధికార ప్రతినిథులు’ కూడా వుండటమేంటి.?

ఎవరో ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా, ఇంకో వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తే, అలా లీక్ చేసిన సమాచారం నిజమైనదో కాదో కూడా చెక్ చేసుకోకుండా స్పేస్‌లు పెట్టి, ప్రభుత్వం నుంచే సమాచారం లీక్ అయ్యిందంటూ సుదీర్ఘంగా స్పేస్‌లు నడిపారు టీడీపీ కార్యకర్తలు.

చిత్రంగా ఈ స్పేసుల్లో టీడీపీ అధికార ప్రతినిథులు కూడా పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలే కాదు, బీజేపీ మద్దతుదారులు కూడా ఇలా స్పేసుల్లో హడావిడి చేశారు. ఇదంతా, ఓ జనసేన మద్దతుదారుడిపైన గుస్సా అవుతూ చేసిన హడావిడి.

వైసీపీ అయితే, తమ అధికారిక హ్యాండిళ్ళ ద్వారా ఆ సోషల్ మీడియా పోస్టుపై రచ్చ రచ్చ చేస్తోంది. వైసీపీతో పాటు టీడీపీకి చెందిన కొందరు, బీజేపీకి చెందిన కొందరు సోషల్ మీడియా బ్యాచ్.. ఈ మొత్తం రచ్చని తారాస్థాయికి తీసుకెళ్ళారు.

సోషల్ మీడియాలో ఎవరైనా వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తే అది ముమ్మాటికీ నేరమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, అలా లీక్ అయ్యిందని చెప్పబడుతున్న సమాచారం నిజమా.? కాదా.? అన్నది తేలకుండానే ఈ రచ్చ దేనికి సంకేతం.? పైగా, ప్రభుత్వంలో వుండీ.. ఈ అవనసరమైన నాన్సెన్స్ చేయడమేంటి.?

అన్నిటికీ మించి, వైసీపీకి టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు వంత పాడటం.. ఆశ్చర్యకరం. జనసేన మాత్రమే అధికారంలో వుందా.? ఆ జనసేన పైకి విపక్షాలుగా వైసీపీ, టీడీపీ, బీజేపీ.. దూసుకెళుతున్నాయా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి పరిస్థితుల్ని చూస్తోంటే.

వైసీపీ, బీజేపీ సంగతి పక్కన పెడితే, సోకాల్డ్ టీడీపీ కార్యకర్తల కారణంగా టీడీపీకి తీరని నష్టం కలుగుతోంది. అందుకే, టీడీపీకి వేరే శతృవులు అక్కర్లేదనేది.!

సినిమా

Bala Krishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Bala Krishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందా..? ఇండస్ట్రీ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్....

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

రాజకీయం

పయ్యావుల ప్రశ్నలతో మండలిలో బొత్సకు ఇబ్బంది

అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర, రాష్ట్ర...

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, వీఏవోలతో చర్చకు సిద్ధం: నారా లోకేష్

అమరావతి: అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వీఏవోల సమస్యలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయాల్సిన అవసరం...

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం: నారా లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్...

ఎక్కువ చదివినవి

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్ చూసి ఫిదా కానివారు లేరు. క్లిష్టమైన...

Daily Horoscope: ఉద్యోగ అవకాశాలు – సింహానికి శుభవార్త, ధనుస్సుకు ఆర్థిక లాభ సూచనలు

ఫిబ్రవరి 28, 2026 శనివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీ పనుల్లో వేగం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు మీపై వస్తాయి. సహచరుల సహకారం లభిస్తుంది. కుటుంబ విషయాల్లో శాంతంగా ఉండాలి. ఖర్చుల...

‘రాకాస’తో థియేటర్‌లో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్: నిహారిక కొణిదెల

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో 2024లో భారీ విజయాన్ని అందుకుని అనేక అవార్డులు, ప్రశంసలు సొంతం చేసుకున్న నిహారిక కొణిదెల ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో,...

ఫేక్ ప్రచారాలకి కట్టడి ఎలా.? కూటమి ప్రభుత్వం అంతర్మధనం.!

ఏదన్నా ఓ మంచి పని చేయాలన్న ప్రయత్నం మొదలయ్యేటప్పటికే, దుష్ప్రచారం అంతకన్నా ముందే విపరీతమైన స్థాయిలో జరిగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చాలా చాలా చిత్రమైన పరిస్థితి ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,...