Switch to English

కాకినాడ పోర్టులో జగన్ మాఫియా అక్రమాలపై టీడీపీ కన్నెర్ర.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,962FansLike
57,764FollowersFollow

ఓ వైపు ప్రభుత్వం పరంగా, ఇంకో వైపు పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ, కాకినాడ పోర్టులో జగన్ మాఫియా అక్రమాలపై కన్నెర్ర జేస్తోంది. గత వైసీపీ హయాంలో కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూపీ లాగుతున్న సంగతి తెలిసిందే.

కూటమి అధికారంలోకి వచ్చాక కూడా జగన్ మాఫియా, కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణాకి పాల్పడుతుండడాన్ని టీడీపీ, జనసేనతోపాటు కూటమిలో మరో భాగస్వామి అయిన బీజేపీ కూడా సీరియస్‌గా తీసుకుంది.

కూటమి ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఇప్పటికే పలు దఫాలు కాకినాడ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. మరోపక్క, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే, సముద్రంలోకి వెళ్ళి మరీ, జరుగుతున్న రేషన్ మాఫియాపై ఆరా తీశారు.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా అలర్ట్ అయ్యింది. పోర్టు ఆస్తుల కబ్జాపై ఉద్యమానికి సిద్ధమైంది టీడీపీ. ఓ వైపు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూనే, ఇంకో వైపు, వైసీపీ హయాంలో పెచ్చుమీరిపోయిన రేషన్ మాఫియా వ్యవహారాన్ని జనానికి తెలియజేసేందుకు ప్రయత్నిస్తోంది.

కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్ వాటాదారులైన కేవీ రావు, జీఎంఆర్‌ల మెడపై కత్తి పెట్టి 6 వేల కోట్ల విలువైన ఆస్తుల్ని కేవలం 506 కోట్లకే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీ అయిన అరబిందో పేరుపై జగన్ మాఫియా రాయించుకున్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది.

గత వైసీపీ హాయంలో కాకినాడ పోర్టు నుంచి 49 వేల కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగిందన్నది టీడీపీ ఆరోపణ. ప్రైవేటు ఆస్తులు సైతం అన్యాక్రాంతమయ్యాయని టీడీపీ అంటోంది. ఈ నేపథ్యంలో జగన్ మాఫియా ముఠాపై కేవీ రావు ఫిర్యాదు నేపథ్యంలో సీఐడీ నమోదు చేసిన కేసు గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

చెన్నయ్‌కి చెందిన శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ మరియు ముంబైకి చెందిన మరో ఆడిట్ సంస్థతో కాకినాడ సీపోర్టుపై తప్పుడు ఆడిట్ లెక్కల్ని జగన్ సర్కారు రాయించిందనీ, తద్వారా వెయ్యి కోట్ల రూపాయల పన్నుల్ని ఎగ్గొట్టినట్లు ఆడిట్ రిపోర్టు సృష్టించారనీ, తద్వారా కేవీ రావుని బెదిరించారనీ, అలా బెదిరింపులకు దిగి సీపోర్టు కంపెనీ షేర్లని వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి పేరుతో రాయించుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

వైఎస్ జగన్ సైతం, విక్రాంత్ రెడ్డి చెప్పినట్లే చేయాలని కేవీ రావుకి సూచించారన్నది టీడీపీ ఆరోపణ. 10 వేల ఎకరాలున్న కాకినాడ సెజ్‌లో జీఎంఆర్ వాటా 51 శాతం కాగా, కేవీరావు 46 శాతం వాటా కలిగి వున్నారు. 2300 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు నిర్మించాలని జీఎంఆర్ భావించి, 2019లో అప్పటి సీఎం చంద్రబాబుతో శంకుస్థాపన చేయించింది. బోగాపురం విమానాశ్రయం కాంట్రాక్టు టీడీపీ ప్రభుత్వ హయాంలో జీఎంఆర్‌కి రాగా, కాకినాడ సెస్‌లో వాటాను అరబిందోుకి ఇవ్వకపోతే బోాపురం కాంట్రాక్టు రద్దు చేస్తామని బెదిరించి, సెజ్‌ని వైసీపీ పెద్దలు తమ పేరున రాయించుకున్నారు.

సీఐడీ త్వరగా కేసు విచారణ పూర్తి చేసి, వైసీపీ మాఫియాపై చార్జి షీటు వేయాలనీ, అదే సమయంలో జగన్ మాఫియాపై పార్టీలకతీతంగా ప్రజలు నిరసన తెలపకపోతే ఎవరి ఆస్తులకూ రక్షణ వుండదని టీడీపీ చెబుతోంది.

సినిమా

ఐటీ దాడులతో ఆ ‘సినిమాల’ లెక్కలు తేలతాయా.?

ఓ సినిమా ఎంత వసూలు చేసింది.? ఎంత పెద్ద హిట్టయ్యింది.? ఈ విషయాల్ని వెల్లడించాల్సింది నిర్మాత మాత్రమే. బాక్సాఫీస్ లెక్కలంటూ సినీ మీడియాలో రాతలు కుప్పలు...

అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అక్కినేని వారి ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తన ప్రేయసి శోభితను పెళ్లి చేసుకున్నాడు. చైతూ పెళ్లి సమయంలోనే అఖిల్...

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్ డిశ్చార్జి.. ఐదు రోజుల తర్వాత..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను...

ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్

ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది....

పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టండి.. లక్ష్మీ మిట్టల్ ను...

దావోస్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న అంశాలను వివరిస్తూ పెట్టుబడిదారులను...

రాజకీయం

డిప్యూటీ సీఎం పదవి ఎందుకంత స్పెషల్.!

ఉప ముఖ్యమంత్రి పదవి.. గతంలో ఎంతోమంది ఈ పదవిలో వున్నారనీ, అయితే.. ఉప ముఖ్యమంత్రిగా ఎవరికీ సరైన గుర్తింపు రాలేదనీ, ఆ పదవికి ఎవరూ సరైన గుర్తింపు తీసుకురాలేకపోయారనీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో...

పాతాళానికి తొక్కివేయబడ్డ వైసీపీకి అవకాశమిస్తోన్న టీడీపీలోని ఓ ‘వర్గం’.!

చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీలో పావులు కదపడమేంటి.? టీడీపీ అను‘కుల’ మీడియా ఎందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.? నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, నారా లోకేష్ ముఖ్యమంత్రి.. అంటూ ఓ వర్గం టీడీపీ...

ఆ నోళ్ళకి తాళం వేసిన టీడీపీ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా.?

‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని...

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా: చంద్రబాబు

నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడుతానంటూ చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు జాతి నిత్య స్ఫూర్తిని ఇస్తుందని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంతోషమే తనకు ముఖ్యం అన్నారు....

లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్‌కేంటి నష్టం.?

నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ కొందరు టీడీపీ నాయకులు, మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. సీఎం పవన్ కళ్యాణ్.. అని జనసేన శ్రేణులు హడావిడి చేస్తున్నాయి కదా.. ఇదీ...

ఎక్కువ చదివినవి

నాగసాధువులుగా మారిన 1500 మంది.. తమకు తామే పిండం పెట్టుకుని..!

మహాకుంభమేళా సందర్భంగా ఎన్నో ఘటనలు తెరమీదకు వస్తున్నాయి. అందులోనూ నాగసాధువులు, అఘోరాలు, బాబాలు కుంభమేళా వద్ద కనిపిస్తున్న విధానాలు, అక్కడ వారు చేస్తున్న పనులు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా...

ఆ నోళ్ళకి తాళం వేసిన టీడీపీ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా.?

‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని...

ఏం బతుకు బతుకుతున్నాం.? తమన్ ఆవేదన, చిరంజీవి బాసట.!

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్, ‘డాకు మహరాజ్’ సినిమా ఈవెంట్‌లో ‘ఏం బతుకు బతుకుతున్నాం..’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘గేమ్ చేంజర్’ సినిమా పైరసీ, సినిమాలపై...

పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టండి.. లక్ష్మీ మిట్టల్ ను కోరిన లోకేష్..!

దావోస్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న అంశాలను వివరిస్తూ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. ఇక తాజాగా ఉక్కు దిగ్గజం...

Daku Maharaj: తల్లిదండ్రులు, కళామతల్లి ఆశీర్వాదమే డాకు మహరాజ్ సక్సెస్: బాలకృష్ణ

Daku Maharaj: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్' సూపర్ హిట్టయిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం విజయోత్సవ సభ నిర్వహించింది చిత్ర యూనిట్. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్లో జరిగిన కార్యక్రమంలో...