ఏపీ రాజధాని అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీకి వరల్డ్ బ్యాంకు రూపంలో పెద్ద షాకే తగిలింది. అమరావతికి నిధులు ఇచ్చే విషయంలో తాము వెనక్కి వెళ్లడానికి అధికార వైఎస్సార్ సీపీ కారణం కాదని, కేంద్రం సూచనల మేరకే తాము రాజధానికి ఆర్థికసాయం అందించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రతిపక్ష టీడీపీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది.
రాజధాని నిర్మాణానికి ఆర్థికసాయం అందజేస్తానని ఏపీ ప్రభుత్వానికి గతంలో ప్రపంచబ్యాంకు హామీ ఇచ్చింది. అయితే, రెండు రోజుల క్రితం తాము రాజధానికి ఆర్థికసాయం ఇచ్చే విషయంలో తప్పుకుంటున్నట్టు పేర్కొంది. దీంతో తెలుగుదేశం వర్గాలు ఒక్కసారిగా అధికార పార్టీపై ఆరోపణలు గుప్పించాయి. ప్రపంచబ్యాంకు రుణం వెనక్కి వెళ్లిపోవడానికి కారణం ఏపీ సీఎం జగన్ అంటూ విమర్శలకు దిగాయి.
‘‘జగనన్న వచ్చారు వరల్డ్ బ్యాంకు పోయింది. జగన్ గారి కల నేరవేరింది. మొత్తానికి అమరావతిని పడగొట్టేసారు. రైతులను రెచ్చగొట్టడం, పంటలు తగలబెట్టడం, దొంగ ఉత్తరాలు, ఇలా జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెలవంది. బాబుగారి హయాంలో కళకళలాడిన అమరావతి మీ తుగ్లక్ చర్యలతో ఖాళీ అయ్యింది. అమరావతి నిర్మాణాన్నిఅడ్డుకునే కార్యాచరణలో జగన్ గారు మొదటి అడుగు విజయవంతంగా వేశారు. ఇక ఆంధ్రుల కలల రాజధాని కేవలం కలగానే మిగిలిపోతుందేమో!’’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో జగన్ పై విరుచుకుపడ్డారు.
టీడీపీకి చెందిన ఇతర నేతలు సైతం తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలో వైఎస్సార్ సీపీ నేతలకు అర్థం కాలేదు. అసలు ప్రపంచబ్యాంకు అర్థంతరంగా వెనక్కి వెళ్లడానికి కారణాలేమిటో తెలియక తలలు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా ప్రపంచ బ్యాంకు స్వయంగా స్పందించింది.
అమరావతి నుంచి తాము వెనక్కి వెళ్లడానికి కారణం కేంద్రం సూచనలే అని పేర్కొంది. ఏపీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని, ఇతరత్రా ప్రాజెక్టుల కోసం మరింత సాయం చేస్తామని పేర్కొంది. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు ఊపిరి పీల్చుకోగా.., తెలుగుదేశం పార్టీ ఇరుకున పడింది. తాము ఒకటి తలిస్తే ఇలా అయ్యిందేమిటా అని టీడీపీ నేతలు నిట్టూర్పులు విడుస్తున్నారు.
260463 467602I dugg some of you post as I thought they were really beneficial handy 506839
731431 694415I think one of your commercials caused my browser to resize, you might want to put that on your blacklist. 514930