Switch to English

వైసీపీకి అమ్ముడుపోయిన టీడీపీ ’కుల‘ మీడియా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,766FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి.? అన్న విషయమై తెలుగుదేశం పార్టీలో అంతర్గత చర్చ జరిగితే సరిపోదు.! టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరగాలి.! రెండు పార్టీలూ కలిసి కూర్చుని, చర్చించుకున్నాక ఓ నిర్ణయానికి వస్తాయ్.!

భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో కలిస్తే.? ఈ ఆలోచనతోనే, సీట్ల పంపకాల విషయమై ఇటు టీడీపీ అటు జనసేన.. ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. వాస్తవానికి, జనసేన పార్టీ మీద తొలుత వలపు బాణం విసిరింది నారా చంద్రబాబునాయుడే.

‘జనసేన పార్టీతో కలవడానికి సిద్ధంగా వున్నాం. కానీ, వన్ సైడ్ లవ్ వల్ల ప్రయోజనం లేదు కదా.?’ అంటూ చంద్రబాబు తొలుత పొత్తుల ప్రస్తావన తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ముఖ్య నేతలతో చర్చించారు. వైసీపీని దించాలంటే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న తన ఆలోచనని పార్టీ ముఖ్య నేతలతో సంచుకున్నారు జనసేనాని.

అదే విషయాన్ని పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఏర్పాటైన ఓ బహిరంగ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా టీడీపీ – జనసేన కలవడానికి చాలా సమయం పట్టిందనుకోండి.. అది వేరే సంగతి.

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టయ్యాక, పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయిన టీడీపీ శ్రేణులకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధైర్యాన్నిచ్చారన్నది బహిరంగ రహస్యం. ఆ విషయాన్ని అటు చంద్రబాబుగానీ, ఇటు ఆయన తనయుడు నారా లోకేష్‌గానీ.. అంత తేలిగ్గా మర్చిపోతారనుకోలేం.

అయితే, మొదటి నుంచీ టీడీపీ మీద తమదే పెత్తనం.. అన్న భ్రమల్లో వున్న టీడీపీ అను‘కుల’ మీడియా, 2019 ఎన్నికల్లో ఎలాగైతే తన ‘అతి’తో టీడీపీని నాశనం చేసిందో, ఇప్పుడూ అదే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పోటీ చేయబోయే సీట్లను ఆ ‘కుల’ మీడియా ఖరారు చేసేసింది. దాంతో, టీడీపీ అవాక్కయ్యింది.. జనసేన నవ్వుకుంది. జనసేనకు దారిచ్చి, వ్యూహాత్మకంగా పక్కకు తప్పుకున్న టీడీపీ నాయకులు కొందరు, తమ సామాజిక వర్గానికే చెందిన ‘కుల’ మీడియా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

‘చంద్రబాబుని మళ్ళీ జైలుకు పంపించేసి, టీడీపీని నాశనం చేసే దిశగా కుల మీడియా కంకణం కట్టుకున్నట్టుంది. టీడీపీ – జనసేన పొత్తు విషయమై కుల మీడియా అతి చూస్తోంటే, వైసీపీకి పూర్తిగా అమ్ముడుపోయినట్లే కనిపిస్తోంది..’ అన్న భావన టీడీపీలో వ్యక్తమవుతోంది.

నిజానికి, ఈ కుల మీడియా అంతా నారా లోకేష్ కనుసన్నల్లో నడుస్తోందన్న వాదన ఒకటుంది. కానీ, లోకేష్‌ని సైతం జస్ట్ వెర్రి వెంగళప్పలా భావించే ఆ కుల మీడియా, లోకేష్ విసిరే ఎంగిలి మెతులకు కక్కుర్తి పడటం మామూలుగానీ, వైసీపీ నుంచి సరైన ప్యాకేజీ దొరికితే.. చంద్రబాబుని ముంచేయకుండా వుంటుందా.?

వున్నపళంగా చంద్రబాబు డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగకపోతే, కుల మీడియా సృష్టించే అభూతకల్పనలకి టీడీపీ పూర్తిగా కాలగర్భంలో కలిసిపోక తప్పదు

సినిమా

ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో...

‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మేగజైన్ కవర్ పేజీపై విజయ్..

విజయ్ దేవరకొండ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న విజయ్ ను.. మేగజైన్స్ కూడా క్యాప్చర్ చేసేస్తున్నాయి. ఇప్పటి...

రాజ్ తో రిలేషన్ బయట పెట్టేసిన సమంత..

స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో రిలేషన్ ను పెట్టేసినట్టు తెలుస్తోంది. ఆమె తాజాగా పోస్టు చేసిన ఫొటోనే...

Jr Ntr: ఆ మహానుభావుడి బయోపిక్ లో ఎన్టీఆర్..! రాజమౌళి దర్శకుడు.....

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారా? ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ వీరి కలయికలో రానుందా..? అంటే ఔనంటోంది బాలీవుడ్ మీడియా. దీనిపై...

నితిన్ ‘తమ్ముడు’ మూవీ జులై 24కు వాయిదా..?

యంగ్ హీరో నితిన్ తమ్ముడు మూవీతో గట్టి హిట్ కొట్టాలనే తాపత్రయంలో ఉన్నాడు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు మూవీకి మంచి...

రాజకీయం

2029 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదీ.!

2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. నిజానికి, ఘోర పరాజయంపై వైసీపీ నేతలు ఓ స్పష్టతతోనే వున్నా,...

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు..

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిక్కుల్లో పడ్డారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు అటవీశాఖ అధికారులు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ...

వైఎస్ జగన్ పాదయాత్ర.! బెదిరిపోతున్న వైసీపీ నేతలు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేయబోతున్నారట. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెబుతున్నారు. అయితే, అప్పుడే కాదు లెండి.. ఇంకాస్త సమయం...

గ్రూప్-1 లో ఆంజనేయులు అవినీతి.. అర్హులకు అన్యాయం..

వైసీపీ హయాంలో జరిగిన అనేక అవినీతి ఘటనలు బయటకు వస్తున్నాయి. అందులో గ్రూప్-1 పరీక్ష విధానంలో పెండ్యాల సీతారామాంజనేయులు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన చేసిన అవినీతి పొరలు...

ఏపీ సీఎం చంద్రబాబు ప్లానింగ్: అమరావతి.. అంతకన్నా ముందే.?

ఎప్పుడో పునాదులు పడిపోయాయ్.. కొన్ని భవనాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యింది.. కాకపోతే, వైసీపీ హయాంలో మూలన పడేసిన దరిమిలా, వాటన్నిటికీ కొత్త కళ తీసుకురావడానికి కొంత సమయం పట్టింది. ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

Geethanjali: ప్రేమకథే కానీ, దృశ్యకావ్యం.. నిత్య యవ్వన ‘గీతాంజలి’కి 36 ఏళ్లు

Geethanjali: సినిమాలకు క్రౌడ్ పుల్లర్స్ యూత్. సినిమాకి ఎవర్ గ్రీన్ కంటెంట్ లవ్. రెండింటికీ అవినాభావ సంబంధమే ఉంది. అందుకే ప్రేమకథలది బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములా. యువత ధియేటర్లకు పరుగులు పెడతారు. ఫ్యామిలీ...

ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో బేబీ కాంబో రిపీట్ అవుతోంది. ఆనంద్,...

మార్పు మంచిదే: అమర వీరుడి కుటుంబానికి వైఎస్ జగన్ పాతిక లక్షల సాయం.!

మొన్నేమో, తన నియోజకవర్గ పరిధిలో అరటి రైతులు నష్టపోతే, దాదాపు కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించారట. అంతకు ముందెన్నడూ...

చొక్కా విప్పుతున్న మహేష్..?

గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB 29 ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ లుక్స్, యాక్షన్ సీన్స్ అన్ని...

విశ్వక్ సేన్ ‘కల్ట్’ మూవీ ప్రారంభం.. రెగ్యులర్ షూట్ నేటి నుంచే..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మరోసారి డైరెక్టర్ బాధ్యతలు తీసుకున్నాడు. తానే హీరోగా, డైరెక్టర్ గా చేస్తున్న కొత్త...