Switch to English

ఇదెక్కడి మాస్ ర్యాగింగ్ పట్టాభి? ఎస్పీకి వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,202FansLike
57,764FollowersFollow

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. వైఎస్ఆర్సిపి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కొమ్ముకాసిన అధికారుల్లో భయం మొదలైంది. ఈ నేపథ్యంలో తనని వేధించిన ఎస్పీ కి టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ తన స్టైల్ లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనపై అక్రమ కేసులు బనాయించి తనని వేధించిన ఎస్పీని వదిలేది లేదంటూ హెచ్చరించారు. ఈ మేరకు పట్టాభి గతంలో కృష్ణాజిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా ఇంటికి వెళ్లారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.

‘ నాపై అక్రమ కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ తో రాచ మర్యాదలు చేసిన ఎస్పీ జాషువా ని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాను. ఆయన కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు తోటవల్లూరు పోలీస్ స్టేషన్ లో నన్ను నిర్బంధించి అర్ధరాత్రి సమయంలో కరెంటు తీసేసి మరీ నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆయనని కలిసి సత్కరించాలని వచ్చాను. ఆయన తనకున్న ఏడెకరాల విశాలమైన ఫామ్ హౌస్ లో ఉన్నారని తెలుసుకొని శాలువ, పూల బొకే తీసుకుని వచ్చాను. కానీ ఆయన ఇక్కడ లేరు. నిన్నటి నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని తెలిసింది. అందుకే ఈ శాలువా, బొకేని ఇక్కడే పెట్టి వెళుతున్నా’ అని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పట్టాభి.. తనకు రాచ మర్యాదలు చేసిన ఎస్పీని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఇప్పటికే ఎస్పీ ఫోన్ కి పంపించినట్లు తెలిపారు.

అసలేం జరిగిందంటే..

అప్పటి టీడీపీ నేత వల్లభనేని వంశీ.. వైసీపీ కి మద్దతిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. ఆ కారణంతో కొందరు గన్నవరంలోని టీడీపి ఆఫీస్ ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న హింసకు పట్టాభిరామ్ కారణమయ్యారన్న నెపంతో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు.

2023 ఫిబ్రవరి 20న పట్టాభిని తోటవల్లూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత ఆయన్ని కోర్టుకి అప్పజెప్పే సమయంలో ఆయన ఒంటిపై గాయాలు కనిపించాయి. ఆయనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు పట్టాభిరామ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల హింస మరింత పెరిగిందని అప్పట్లో కృష్ణాజిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా మీడియాకి తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న పట్టాభి బుధవారం ఎస్పీని కలవడానికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారు.

755 COMMENTS

సినిమా

8 రోజుల్లో రాజా సాబ్… ఇంకా దూరమే గమ్యం!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ మధ్య తన ప్రయాణాన్ని...

మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర...

“చిరంజీవి సినిమా బాగుందంట…”ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్… 5 రోజుల్లోనే ₹226...

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ...

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

రాజకీయం

పవన్ కళ్యాణ్: పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే కూటమి ప్రభుత్వం… గ్రీన్ ఎనర్జీలో ఏపీకి కొత్త దిశ

పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వాలు మారినా విధానాల్లో స్థిరత్వం ఉండాలన్నదే తమ ప్రభుత్వ...

మాట నిలబెట్టుకున్న సీఎం… ఉద్యోగుల ఖాతాల్లో నగదు

సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన పండుగలా మార్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల...

Liquor Scam Case: విజయ్ సాయిరెడ్డికి ఈడీ నోటీసులు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన...

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

ఎక్కువ చదివినవి

సోషల్ మీడియా వలలో పడిన వందల మంది..! భార్యాభర్తల బ్లాక్‌మైలింగ్ గుట్టు రట్టు

కరీంనగర్‌లో జరిగిన ఓ సంచలన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పురుషులను వలలో పడేసి, శృంగార వీడియోలతో బెదిరించి లక్షల రూపాయలు దండుకున్న భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి...

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

భర్తల జీవిత ప్రశ్నకు సమాధానం చెప్పే సినిమా: కిషోర్ తిరుమల

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో, దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, ఎస్ఎల్‌వి సినిమాస్...