Switch to English

అమరావతికి మహా పాదయాత్రకి టీడీపీ వెన్నుపోటు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహా పాదయాత్ర’ అంటూ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఓ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే. సరే, ఆ రైతుల్లో అపర కుబేరులే వున్నారా.? కేవలం ఓ కులానికి చెందిన రైతులే ఉద్యమిస్తున్నారా.? అన్నది వేరే చర్చ.

150 మందికి పైగా రైతులకు (అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు) హైకోర్టు నుంచి అనుమతి పొంది మహా పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర అయితే, అంచనాలకు మించిన ఉత్సాహంగా కొనసాగుతోంది. పెద్దయెత్తున ప్రజల మద్దతు కూడా మహా పాదయాత్రకు కనిపిస్తోంది. భారీ స్థాయిలో విరాళాలూ అమరావతి పరిరక్షణ సమితికి సమకూరుతుండడం విశేషమే.

రాజధాని అమరావతి కోసం రైతులు భూములిచ్చారు.. అమరావతిలో రాజధానిని నిర్మిస్తామని ప్రకటించి ప్రభుత్వం మోసం చేసింది రైతుల్ని. ఆ ప్రభుత్వాన్ని రైతులు నిలదీస్తున్నారు. ఇందులో రైతుల్ని తప్పుపట్టడానికేమీ లేదు. నిజానికి, రాష్ట్రానికి రాజధాని అత్యంత అవసరం. రాజధాని లేని రాష్ట్రంలో అసలు అభివృద్ధి అనే మాటకు చోటెక్కడుంటుంది.? అసలు రాష్ట్రానికి ఉనికి ఎక్కడుంటుంది.?

అయితే, ఇక్కడ రాజధాని అమరావతికి చంద్రబాబు హయాంలోనూ అన్యాయమే జరిగింది. చంద్రబాబు హయాంలోనే రాజధాని నిర్మాణం పూర్తిస్థాయిలో జరిగి వుంటే, ఇప్పుడీ దుస్థితి రైతులకు వచ్చి వుండేది కాదు. అంతర్జాతీయ స్థాయి రాజధాని.. అంటూ ఆకాశానికి నిచ్చెనలేసి, అమరావతిని అయోమయంలో పడేశారు చంద్రబాబు.

ఇక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే, రాజధాని మారదంటూనే, అమరావతి నోట్లో మట్టికొట్టేశారు. అమరావతి ఆగిపోయిందంటే.. అది రాష్ట్ర ప్రభుత్వానికీ, రాష్ట్రానికీ అవమానమన్న ఇంగితాన్ని మర్చిపోయారు.

ఇదిలా వుంటే, రైతుల యాత్రకు మంచి స్పందన సాధారణ ప్రజానీకం నుంచి వస్తున్నా, ఆ యాత్రలోకి టీడీపీ మూకలు చొరబడుతూ, యాత్రను ఉద్రిక్తంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిన్నటి ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు నిదర్శనం. అమరావతి రైతుల పాదయాత్ర ద్వారా పొలిటికల్ క్రెడిట్ పొందేందుకు టీడీపీ వేస్తున్న చిల్లర వేషాలు, అమరావతి ఉద్యమానికే వెన్నుపోటు పొడిచేలా వున్నాయి.

అమరావతి పరిరక్షణ సమితి ఈ విషయంలో అప్రమత్తంగా వుండకపోతే, ముందు ముందు ఈ యాత్ర సజావుగా సాగడం అసాధ్యమే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...