అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్తో ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహా పాదయాత్ర’ అంటూ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఓ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే. సరే, ఆ రైతుల్లో అపర కుబేరులే వున్నారా.? కేవలం ఓ కులానికి చెందిన రైతులే ఉద్యమిస్తున్నారా.? అన్నది వేరే చర్చ.
150 మందికి పైగా రైతులకు (అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు) హైకోర్టు నుంచి అనుమతి పొంది మహా పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర అయితే, అంచనాలకు మించిన ఉత్సాహంగా కొనసాగుతోంది. పెద్దయెత్తున ప్రజల మద్దతు కూడా మహా పాదయాత్రకు కనిపిస్తోంది. భారీ స్థాయిలో విరాళాలూ అమరావతి పరిరక్షణ సమితికి సమకూరుతుండడం విశేషమే.
రాజధాని అమరావతి కోసం రైతులు భూములిచ్చారు.. అమరావతిలో రాజధానిని నిర్మిస్తామని ప్రకటించి ప్రభుత్వం మోసం చేసింది రైతుల్ని. ఆ ప్రభుత్వాన్ని రైతులు నిలదీస్తున్నారు. ఇందులో రైతుల్ని తప్పుపట్టడానికేమీ లేదు. నిజానికి, రాష్ట్రానికి రాజధాని అత్యంత అవసరం. రాజధాని లేని రాష్ట్రంలో అసలు అభివృద్ధి అనే మాటకు చోటెక్కడుంటుంది.? అసలు రాష్ట్రానికి ఉనికి ఎక్కడుంటుంది.?
అయితే, ఇక్కడ రాజధాని అమరావతికి చంద్రబాబు హయాంలోనూ అన్యాయమే జరిగింది. చంద్రబాబు హయాంలోనే రాజధాని నిర్మాణం పూర్తిస్థాయిలో జరిగి వుంటే, ఇప్పుడీ దుస్థితి రైతులకు వచ్చి వుండేది కాదు. అంతర్జాతీయ స్థాయి రాజధాని.. అంటూ ఆకాశానికి నిచ్చెనలేసి, అమరావతిని అయోమయంలో పడేశారు చంద్రబాబు.
ఇక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే, రాజధాని మారదంటూనే, అమరావతి నోట్లో మట్టికొట్టేశారు. అమరావతి ఆగిపోయిందంటే.. అది రాష్ట్ర ప్రభుత్వానికీ, రాష్ట్రానికీ అవమానమన్న ఇంగితాన్ని మర్చిపోయారు.
ఇదిలా వుంటే, రైతుల యాత్రకు మంచి స్పందన సాధారణ ప్రజానీకం నుంచి వస్తున్నా, ఆ యాత్రలోకి టీడీపీ మూకలు చొరబడుతూ, యాత్రను ఉద్రిక్తంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిన్నటి ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు నిదర్శనం. అమరావతి రైతుల పాదయాత్ర ద్వారా పొలిటికల్ క్రెడిట్ పొందేందుకు టీడీపీ వేస్తున్న చిల్లర వేషాలు, అమరావతి ఉద్యమానికే వెన్నుపోటు పొడిచేలా వున్నాయి.
అమరావతి పరిరక్షణ సమితి ఈ విషయంలో అప్రమత్తంగా వుండకపోతే, ముందు ముందు ఈ యాత్ర సజావుగా సాగడం అసాధ్యమే.
Genießen Aktivitäten Geschenken zahlreiche Boni, wenn Sie spielen online.
283107 986770Lovely sharp post. Never considered that it was that simple. Praises to you! 624040