వైసీపీ కేరాఫ్ అబద్ధాలు, విషప్రచారం – టీడీపీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,340FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వైసీపీపై తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం, తప్పుడు ప్రచారాలు చేయడం, సమాజంలో విభేదాలు సృష్టించడం వైసీపీ అసలు లక్ష్యమని ఆరోపించింది. అధికారంలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి చేయకపోయినా, తాము చేసినట్లుగా అబద్ధాలు చెబుతారని, అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ ముఠా పని అని టీడీపీ తీవ్రంగా మండిపడింది.

టీడీపీ నాయకులు విమర్శిస్తూ, ప్రజా వేదిక నిర్మాణ ఖర్చు పై అబద్ధాలు చెప్పి దానిని కూల్చివేయడం, హైకోర్టు తీర్పులపై న్యాయమూర్తులను దూషించడం, “పింక్ డైమండ్” అంటూ తప్పుడు కథలు సృష్టించడం వైసీపీ చరిత్రలో భాగమే అన్నారు. అంతేకాక, రాజకీయంగా లాభం కోసం కుటుంబ సంబంధాలను కూడా వక్రీకరించిన దారుణ చరిత్ర వైసీపీదేనని అన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి – సంక్షేమం ఒకేసారి ముందుకు సాగుతుంటే, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలపై వైసీపీ విషప్రచారం చేస్తోందని టీడీపీ ఆరోపించింది. పెట్టుబడులు రాష్ట్రానికి రావడమే తమ కడుపు మంటగా భావించి, విశాఖలో ప్రముఖ కంపెనీలకు భూములు కేటాయిస్తే కూడా కోర్టుల్లో కేసులు వేయించడం, పెట్టుబడులను అడ్డుకోవడం వైసీపీ అసలు పని అని అన్నారు.

సోషల్ మీడియా ద్వారా కూడా వైసీపీ తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా చేస్తోందని టీడీపీ ఆరోపించింది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనల వీడియోలు, ఫొటోలు మార్చి ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లు ప్రచారం చేయడం, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని తప్పుడు వార్తలు పుట్టించడం వైసీపీకి సహజమైపోయిందని టీడీపీ పేర్కొంది.

మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కూడా వైసీపీ ప్రయత్నిస్తోందని టీడీపీ మండిపడింది. ఒక పాస్టర్ మరణాన్ని “హత్య”గా ప్రచారం చేసి మతపరమైన ఉద్రిక్తతలు రేపే ప్రయత్నం చేసిన వైసీపీ, తిరుమల, శ్రీశైలం వంటి పవిత్ర దేవస్థానాలపైనా విషప్రచారం చేస్తుందని ఆరోపించింది. ఆవుల మరణాలు, ప్రసాదంలో కీటకాలు ఉన్నాయంటూ అబద్ధాలు ప్రచారం చేసి దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు చేసినట్లు టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది.

ప్రకాశం బ్యారేజీ గేట్లు మొరాయించడాన్ని పెద్ద సమస్యగా చూపిస్తూ, విజయవాడ మునిగిపోతుందంటూ తప్పుడు కథలు పుట్టించడం, వరద సహాయక చర్యల ఖర్చును వందల కోట్లుగా చూపించడం వైసీపీ పనితీరు అని టీడీపీ ధ్వజమెత్తింది.

మొత్తానికి, రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి, సుఖసంతోషాలపై అసూయతో, ప్రతి అంశంలో తప్పుడు ప్రచారమే వైసీపీ అసలు ఎజెండా అని టీడీపీ ఘాటుగా విమర్శించింది. అబద్ధాలు, విషప్రచారం, దిగజారుడు రాజకీయాలకే కేరాఫ్ అడ్రస్ వైసీపీ అని టీడీపీ స్పష్టం చేసింది.

సినిమా

సైలెంట్‌గా స్టార్‌డమ్ దిశగా భాగ్యశ్రీ బోర్సే..

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ అందరికీ ఒకే విధంగా రాదు. కొందరు ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోతారు. మరికొందరు మాత్రం ఒక్కో సినిమా, ఒక్కో...

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

జగన్‌పై ప్రశాంత్ కిషోర్ .. తీవ్ర వ్యాఖ్యలు వైరల్

రాజకీయ వ్యూహకర్త Prashant Kishor తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddyపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్...

RB Choudary: చిత్రసీమలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం చెందారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. సూపర్ గుడ్...

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే భారం!

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత బలపరుస్తుందా లేదా అన్నది నిర్ణయించే అంశంగా...

Jana Nayagan: విజయ్ క్రేజ్.. ‘జననాయగన్’లో టైటిల్ కార్డు మార్చండి.. ఫ్యాన్స్ రిక్వెస్ట్

Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ పార్టీ మధ్యలో వెలుగులోకి రావడం చిన్న...