Switch to English

వైసీపీ, టీడీపీ కుమ్మక్కు.. న్యాయవ్యవస్థతో ఏంటీ ‘బంతాట’.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు.. పేరుతో వైఎస్ జగన్ సర్కార్ ఓ సంక్షేమ పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం విదితమే. వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న వ్యవహారమిది. రాష్ట్ర బడ్జెట్ ఎంత.? ఈ సంక్షేమ పథకానికి అయ్యే ఖర్చు ఎంత.? అసలు రాష్ట్రం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలా చేపట్టగలుగుతుంది.? ఇలా చాలా ప్రశ్నలు మొదట్లోనే తెరపైకొచ్చాయ్.

భూమిని సేకరించడం లేదా సమీకరించడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ గనుక, తక్కువ స్థలంలో బహుళ అంతస్తుల భవనాలు.. అంటే అపార్టుమెంట్లు కట్టించి పేదలకు ఇవ్వడం ద్వారా భూమి లభ్యత సమస్యను తగ్గించవచ్చన్నది కేంద్రం యోచన.

కానీ, ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, భూమిని ప్రజలకు కానుకగా ఇచ్చి, అందులో ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని జగన్ సర్కార్ సంకల్పించింది. ఈ క్రమంలో పెద్దయెత్తున భూముల్ని సేకరించడమో, సమీకరించడమో చేశారు. తెరవెనుకాల జరిగిన రాజకీయ అవినీతి గురించి కొత్తగా చెప్పేదేముంది.?

ఇంకా కొన్ని చోట్ల వివాదాల కారణంగా, భూముల వ్యవహారంపై గందరగోళం వుంది. ఇంతలోనే, ఈ వ్యవహారంపై మరో పిటిషన్ దాఖలైంది.. ఇళ్ళ నిర్మాణాల్ని తక్షణం ఆపాలంటూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. తక్కువ స్థలంలో ఇళ్ళను కట్టడం, కేవలం మహిళా లబ్దిదారులకే ఇళ్ళను ఇస్తుండడం వంటివాటిపై పిటిషనర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది.

ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ మద్దతుదారులన్నది వైసీపీ ఆరోపణ. కాదు, ఎటూ ఈ పథకం ముందుకు సాగే పరిస్థితి లేదు గనుక, నిధుల కొరత అంశం బయటపడకుండా వుండేందుకు, వైసీపీనే తన మద్దతుదారులతో పిటిషన్ వేయించి, పథకాన్ని ఆపేయించుకుందన్నది టీడీపీ ఎదురుదాడి సారాంశం.

దొందూ దొందే… ఇలాంటి విషయాల్లో వైసీపీ – టీడీపీ స్పష్టమైన అవగాహనతో పనిచేస్తున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఎవరో పిటిషన్లు దాఖలు చేస్తే, కోర్టులు.. ఏమీ ఆలోచించకుండా తీర్పులిచ్చేస్తాయా.? అలాగైతే, ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎందుకు తిరస్కరణకు గురయినట్లు.? చాలా పిటిషన్ల విచారణ సందర్భంగా పిటిషన్ దారుల్ని న్యాయస్థానాలు హెచ్చరిస్తుంటాయన్నది ఇక్కడ ప్రస్తావనార్హం.

కోర్టుల మీద బురదచల్లి, తెరవెనుకాల తమ రాజకీయ లబ్ది నెరవేర్చుకోవడం అన్నది టీడీపీ, వైసీపీలకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడూ అదే జరుగుతోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రజలే, ఇలాంటి విషయాల్లో రాజకీయ పార్టీల కుట్ర, కుతంత్రాల్ని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...