ఐటి రంగంలో హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంద్రప్రదేశ్ను ఐటి రంగంలో అగ్రశ్రేణిలో నిలిపేందుకు గాను తీవ్ర కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి పలు ఐటి కంపెనీలను ఏపీకి తీసుకు రావడానికి మంత్రి లోకేష్ తీవ్రంగా కృషి చేస్తూ వస్తున్నారు.
వైజాగ్ను ఐటి హబ్గా మార్చడానికి పలు కంపెనీలతో మంత్రి లోకేష్ ఒప్పందాలు చేసుకున్నారు. ఇటీవల ప్రముఖ ఐటి దిగ్గజం టిసిఎస్కు విశాఖలో 21.6 ఎకరాల భూమిని 99 పైసలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
విశాఖలో టిసిఎస్ కి 21.16 ఎకరాల భూమిని కేటాయించడం అనేది గేమ్ ఛేంజర్ కాబోతుంది. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడం కోసం ప్రణాళికాబద్దంగా ఆయన ముందుకు సాగుతున్నారు. విశాఖలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటికే పలు కంపెనీలు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఎన్నో ఐటీ కంపెనీలు ఏపీని వదిలి పారిపోయాయి. ఇప్పుడు మంత్రి లోకేష్ వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఎన్నో కంపెనీలు వచ్చాయి.
విశాఖలో టిసిఎస్ డెవలప్ సెంటర్ ఏర్పాటు కోసం సదరు సంస్థ రూ.1370 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. దీంతో 12 వేల ఐటి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఐటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో లోకేష్ చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా టిసిఎస్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. యువత ఐటి ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వైజాగ్ని హైదరాబాద్ను మించిన ఐటి హబ్గా తయారు చేసేందుకు మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు.