తరుణ్ భాస్కర్ టాలీవుడ్ లో డైరెక్ట్ చేసినవి రెండు సినిమాలే అయినా బాగానే పేరు సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో టాలీవుడ్ లో న్యూ ఏజ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకత్వం మాత్రమే కాకుండా హీరోగా, వ్యాఖ్యాతగా కూడా తరుణ్ భాస్కర్ తన మార్క్ ను చూపించాడు. ప్రస్తుతం తన మూడో సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు తరుణ్ భాస్కర్. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలో ఆస్తులు సంపాదించుకున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ ఆస్తులు భూములు, బంగ్లాలు, నగలు కాదట. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, విశ్వక్ సేన్ తనకు ఆస్తులుట.
“నేను భూములు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టట్లేదు. విజయ్, రీతూ, విశ్వక్.. వీళ్ళే నా ఆస్తులు. ఎప్పుడైనా నాకు టాలీవుడ్ లో కష్ట సమయం ఎదురైతే కచ్చితంగా వీళ్ళని వాడుకుంటాను. ఈ విషయాన్ని నేను విజయ్ కు డైరెక్ట్ గానే చెప్పాను. విజయ్ తో నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమా తీయగలుగుతాను” అని చెప్పాడు తరుణ్.
అలాగే తనకు కొత్త వాళ్లతో సినిమానే కంఫర్ట్ గా అనిపిస్తుందని తెలిపాడు. ఇక పెళ్లి చూపులు సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచన కూడా తనకు లేదని అన్నాడు.
984226 52637Its exceptional as your other articles : D, regards for posting . 35207
589163 840511Can anyone support me out? It will be a lot appreciated. 236820
599172 528995I enjoy your wp format, exactly where did you get a hold of it? 834595