Tammineni Sitaram: వైసీపీలో కింది స్థాయి నాయకులెవరైనా కూడా ఈ మాట మాట్లాడకూడదు.! అసలు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింస కాదు, హత్యలంటున్నారు.! ఫినిష్ అంటున్నారు.! అదీ, చట్ట సభలకు వెళ్ళిన ప్రజా ప్రతినిథులు. అందునా, సభాపతి నోట ‘ఫినిష్’ అనే మాట ఎందుకు వస్తోంది.?
కొన్నాళ్ళ క్రితం ‘ల**జత్వం’ అంటూ నోరు జారిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఇప్పుడు ‘ప్రతిపక్ష నేత’ నారా చంద్రబాబునాయుడిని ఉద్దేశించి ‘ఫినిష్’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చిత్రమేంటంటే, ఇదే తమ్మినేని సీతారాం ఒకప్పుడు, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాపకం కోసం వెంపర్లాడారు. రాజకీయం అంటేనే అంత.! సరే, రాజకీయాలన్నాక పార్టీలు దూకెయ్యడం మామూలే. విమర్శలు, ప్రతి విమర్శలు కూడా మామూలే కావొచ్చు.
టీడీపీ అధినేత చంద్రబాబుకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ వుందంటే, అదేమీ ఆషామాషీగా వచ్చింది కాదు. మూడు దఫాలు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రెండు సార్లు, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంకోసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
జాతీయ రాజకీయాల్లోనూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చక్రం తిప్పిన సందర్భాలున్నాయి. సరే, చంద్రబాబుపై రాజకీయ విమర్శలు.. అది మళ్ళీ వేరే చర్చ. ఆయన మంచోడా.? కాదా.? అన్నది కాదిక్కడ చర్చ.
చంద్రబాబు ఓ ప్రజా ప్రతినిథి. అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్గా సభ్యులందరి భద్రతను కాంక్షించాల్సి వుంటుంది తమ్మినేని సీతారాం. సరే, బాధ్యత లేదు.. లైట్ తీసుకోవచ్చు. అంతేగానీ, ‘జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎందుకు.? అది తీసేస్తే ఫినిష్..’ అనడమేంటి.? చంద్రబాబుని చంపేస్తారా ఏంటి.?