సుపరిపాలనకు ఏడాది.! ఔను, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది., ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది.
తల్లికి వందనం పేరుతో నేటి నుంచే, ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే ప్రతి విద్యార్థికీ ఏడాదికి 15 వేల రూపాయల సాయం అందిస్తూ, సంబంధిత మొత్తాన్ని తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది కూటమి ప్రభుత్వం.
ఈ పథకాన్ని ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ హయాంలోనూ ‘అమ్మ ఒడి’ ఈ తరహా సంక్షేమ పథకం అమలైనా, ఇంట్లో కేవలం, ఒక్క బిడ్డకి మాత్రమే ఆ పథకాన్ని అమలు చేయడం చూశాం. పైగా, విడుదల చేసిన మొత్తంలోనూ, వివిధ కారణాలు సాకుగా చూపి కోతలు విధించింది అప్పటి వైసీపీ సర్కార్.
అయితే, ఎలాంటి కోతలు లేకుండా, ఆపై ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే, అందరికీ వర్తించేలా తల్లికి వందనం పేరుతో సంక్షేమ పథకాన్ని అమలు చేయనుంది కూటమి ప్రభుత్వం. 8745 కోట్ల రూపాయల్ని ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం విడుదల చేయనుంది.
కూటమి అధికారంలోకి వస్తూనే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ సహా, సామాజిక పెన్షన్ల పెంపు.. వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం చూశాం. దీపం-2 పథకం కింద, ఏడాదికి మూడు సిలిండర్లను లబ్దిదారులకు ఉచితంగా అందిస్తోంది కూటమి ప్రభుత్వం.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా వున్నా, సంక్షేమ పథకాల్ని అత్యంత ఖచ్చితత్వంతో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం, అదే సమయంలో అభివృద్ధి పనుల్నీ శరవేగంగా చేస్తోంది. రాష్ట్రంలో వైసీపీ హయాంలో దెబ్బ తిన్న రోడ్లన్నిటినీ పూర్తిస్థాయిలో మరమత్తులు చేసింది కూటమి ప్రభుత్వం.
రానున్న ఆగస్టు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న విషయం విదితమే.
