వైఎస్సార్సీపీ నేత శ్యామల ఆరే సోషల్ మీడియా వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన రాజకీయ ప్రయాణంపై వస్తున్న ప్రచారాలు, పుకార్లకు ఘాటుగా స్పందించిన ఆమె.. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలనే లక్ష్యంతోనే జగన్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు.
తన ప్రయాణం ఎవరి కరుణతో ప్రారంభం కాలేదని, తన స్వరం, నిబద్ధత, జగన్ పట్ల ఉన్న విశ్వాసమే తన బలమని శ్యామల వెల్లడించారు. తాడేపల్లిలో “పొగ కనిపిస్తోంది” అంటూ కథలు రాస్తున్నవారిపై కూడా ఆమె పరోక్ష విమర్శలు చేశారు. అలాంటి ప్రచారాలు కొందరిలో ఉన్న అసహనాన్ని మాత్రమే బయటపెడుతున్నాయని వ్యాఖ్యానించారు.
తనను పార్టీ నుంచి దూరం చేయడం పుకార్లతో కానీ, కుట్రలతో కానీ సాధ్యం కాదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతి రోజు తనపై కథనాలు వస్తున్నా, తాను మాత్రం జగన్ కలలుగన్న ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకు సాగుతున్నానని తెలిపారు. తన గొంతును సైలెంట్ చేయాలనే ప్రతి ప్రయత్నం మరింత బలమైన స్వరంగా మారుతుందని ఆమె పేర్కొన్నారు.
ఇది తన కౌంట్డౌన్ కాదని, తన పోరాటానికి మరింత బలమైన ప్రారంభమని శ్యామల ఆరే స్పష్టం చేశారు. చివరగా జగన్పై తన నమ్మకం, ప్రజల ప్రేమే తనను నిలబెడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
శ్యామలకు కౌంట్డౌన్ మొదలైంది అంటూ చీకట్లో చప్పుడు చేస్తున్న వాళ్లకు ఒక్కటే సమాధానం…
నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు…ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం కోసం జగనన్న ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చాను.
ఆ ప్రేమ ఉన్నంత వరకు… నన్నెవరూ ఆపలేరు.నా ప్రయాణం ఎవరి కరుణతో… pic.twitter.com/Ix831tCgV8
— Are (@syamalaAre) May 11, 2026
