టాలీవుడ్ ప్రముఖులు పలువురు ఈమద్య రాబోయే కాలంలో థియేటర్ల మార్కెట్ కంటే ఓటీటీ మార్కెట్ ఎక్కువ ఉంటుందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని సురేష్ బాబు అందరి కంటే ముందు నుండే చెబుతూ వస్తున్నాడు. థియేటర్లు కొన్నాళ్ల తర్వాత ఫంక్షన్ హాల్స్ గా మారాల్సి వస్తుందేమో అంటూ సురేష్ బాబు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలపై కొందరు మండి పడ్డారు. కాని లాక్ డౌన్ తర్వాత దేశంలో వందల సంఖ్యలో థియేటర్లు మళ్లీ ఓపెన్ అవ్వవు అంటున్నారు.
ఇదే సమయంలో ఇండియాలో ఓటీటీ బిజినెస్ 250 రెట్లు పెరిగినట్లుగా సమాచారం అందుతోంది. లాక్ డౌన్ తర్వాత ఇది కాస్త తగ్గినా కూడా భవిష్యత్తు మొత్తం ఓటీటీదే అనే ఉద్దేశ్యంతో సురేష్ బాబు సొంతంగా ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ ను షురూ చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, సురేష్ ప్రొడక్షన్స్కు ఓటీటీ ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటికే కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో కలిసి భాగస్వామ్యంలో కొన్ని ప్రాజెక్ట్లు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా సురేష్ ప్రొడక్షన్స్ నుండి ఓటీటీ కోసం వెబ్ సిరీస్లు చిన్న సినిమాలు వస్తాయని పేర్కొన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మారుతూ వస్తుందని, తప్పకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రేక్షకుల కోసం వెబ్ సిరీస్లు నిర్మిస్తుందని సురేష్ ప్రొడక్షన్స్కు చెందిన ఒక వ్యక్తి అన్నారు. ఇప్పటికే సురేష్ బాబుతో కొన్ని ఓటీటీ సంస్థలు చర్చలు కూడా జరిపినట్లుగా సమాచారం అందుతోంది.
351523 809937Hey! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im surely enjoying your weblog and appear forward to new updates. 68767
353985 624994Thanks for helping out, superb info . 601804