ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రారంభించే యోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఆయన ఓటీటీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది వార్త సారాంశం. కాని తాజాగా ఆయన మీడియాలో వస్తున్న వార్తలను కొట్టి పారేశాడు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రారంభించే యోచన లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతానికి ఓటీటీ కోసం కంటెంట్ ను క్రియేట్ చేయడం మాత్రమే మా పనిగా భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.
ఓటీటీ కోసం భారీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. పెట్టిన పెట్టుబడి వెంటనే రాకపోవచ్చు. లాభాల కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి రావచ్చు. అందుకే ప్రస్తుతానికి ఓటీటీ ఆలోచన లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతానికి అంటే భవిష్యత్తులో ఏమైనా ఆలోచన ఉందా అంటే అది కూడా ఇప్పుడు చెప్పలేమని చెప్పాడు. ఓటీటీ కోసం వెబ్ సిరీస్లు మరియు వెబ్ మూవీస్ను నిర్మించేందుకు ఏర్పాట్లు ప్రారంభించినట్లుగా సురేష్బాబు పేర్కొన్నాడు.
ఇదే సమయంలో హిరణ్య కశ్యప చిత్రం గురించి కూడా సురేష్బాబు క్లారిటీ ఇచ్చాడు. చిన్న బడ్జెట్ చిత్రాలనే తెరకెక్కిస్తున్న సురేష్ బాబు భారీ బడ్జెట్ చిత్రం అయిన హిరణ్య కశ్యప చిత్రంను నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నాడా అంటూ ప్రశ్నించిన సమయంలో కొన్ని కథలను భారీ బడ్జెట్తో తెరకెక్కించాలి. అప్పుడే ప్రేక్షకులను ఆ సినిమాలు మెప్పిస్తాయి. అందుకే హిరణ్య కశ్యప చిత్రంను భారీ బడ్జెట్తో నిర్మించాని నిర్ణయించుకున్నామని ఆయన పేర్కొన్నాడు.
741248 85409Sweet internet website , super pattern , very clean and utilize friendly . 66992
499983 948229You completed several excellent points there. I did specific searches on the issue and found many individuals go in conjunction with along along with your weblog. 933582
450101 504787I dugg some of you post as I thought they were extremely beneficial invaluable 710118