ఏపీలోని రహదారులపై రోడ్డుషోలు, సభలు, సమావేశాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై విచారణ ముగిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. జీవోపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై జోక్యం చేసుకోలేమని.. హైకోర్టు దీనిప విచారణ చేపడుతుందని పేర్కొంది. డివిజన్ బెంచ్ ముందు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చని తెలిపింది. ఈక్రమంలో ఈనెల 23న జీవో నెంబర్ 1పై విచారణ చేపట్టాలని సూచించింది.
సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘జీ.వో.నెం.1 పై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు చెప్పడం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు. జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే.. సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సైకో తరహా నిర్ణయాలతో ఈ ప్రభుత్వం ప్రజల ధనాన్ని వృధా చేస్తోంది. జీ.వో. 1ను వెనక్కి తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.
765924 890212Id require to verify with you here. Which is not 1 thing I usually do! I take pleasure in reading a submit that will make individuals think. In addition, thanks for permitting me to remark! 603042