అమరావతికి సంబంధించిన కేసుల అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. గతంలో పేర్కొన్నట్టే మార్చి 28న విచారణ చేపడతామని జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే.. మార్చి 28న ఒక్కరోజే సరిపోదని.. 29, 30 తేదీల్లో కూడా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోరారు.
దీనికి స్పందించిన న్యాయమూర్తి.. అమరావతి కసు చాలా పెద్దది.. ప్రముఖమైంది. రాజ్యాంగపరమైన అంశాలు కేసులో చాలా ఉన్నాయి. ఇప్పటికి ఈ కేసు గురించి ఇంతకుమించి మాట్లాడలేమని అన్నారు. అయితే.. ఈ అంశాన్ని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయమూర్తు కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసును మార్చి 28కి వాయిదా వేసింది.
గత సోమవారమే సీనియర్ న్యాయవాది కేసును త్వరగా విచారించాలని ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. 28నే విచారిస్తామని స్పష్టం చేసినా మూడు రోజులు తిరక్కముందే మళ్లీ విజ్ఞప్తి చేశారు.
455299 320986I truly appreciate this post. Ive been searching all more than for this! Thank goodness I discovered it on Bing. Youve made my day! Thank you once more.. 217595
736290 882991Thanks for the post. I like your writing style – Im trying to start a blog myself, I believe I may possibly read thru all your posts for some suggestions! Thanks once much more. 935415
391218 26986I like this website really much so much outstanding information. 46041