దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఔషధం వచ్చిందంటే అంతకంటే గుడ్ న్యూస్ మరొకటి ఉండదు. ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అడుగులు పడుతున్నాయి. కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు యాంటీ వైరల్ మెడిసిన ‘ఫావిపిరవిర్’ ను మార్కెట్ లో రిలీజ్ చేసింది ముంబయ్ కేంద్రంగా పనిచేసే సన్ ఫార్మా. ఈ మందును దేశంలో ‘ఫ్లూగార్డ్’గా అందుబాటులోకి తెస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ట్యాబ్ లెట్ ధరను రూ.35కే అందిస్తున్నట్టు కూడా పేర్కొంది. కరోనా తొలి లక్షణాల నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్నవారిలో ఈ మందును వాడొచ్చని కంపెనీ తెలిపింది. ఈ వారమే ‘ఫ్లూగార్డ్’ను మార్కెట్ లోకి ప్రవేశపెడుతున్నట్టు తెలిపింది. ఇందుకు కేంద్రం అమోదం కూడా పొందింది. ఈ మందుతో బాధితులకు తక్కువ ధరకే మందు లభ్యం కావడంతోపాటు చికిత్స అందించే వైద్యులకు వెసులుబాటు కలుగుతుందని కంపెనీ సీఈఓ (ఇండియా) కృతి గనోర్కర్ తెలిపారు.
ఇప్పటికే పలు కంపెనీలు ఈ మందును మార్కెట్ లో వివిధ పేర్లతో విడుదల చేశాయి. జపాన్ లో ఇప్పటికే ఫుజీ హోల్డింగ్ కార్పొరేషన్ ఈ ఔషధాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం సన్ ఫార్మా ద్వారా భారత్ లో అందుబాటులోకి వస్తోంది. ఈ మందును దేశంలో ‘ఫ్లూగార్డ్’ గా మంగళవారం విడుదల చేసింది.
770039 956255As I internet site owner I believe the articles here is actually great , thankyou for your efforts. 464587
514855 906151Awesome blog, Im going to spend much more time researching this subject 265364
745233 374668The next time I learn a weblog, I hope that it doesnt disappoint me as a lot as this 1. I mean, I do know it was my choice to read, nonetheless I in fact thought youd have something attention-grabbing to say. All I hear is really a bunch of whining about something that you could fix for those that werent too busy in search of attention. 284308