సుకుమార్ ఇప్పుడు అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్నాడు. చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా వాటితో తన మార్కును క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప చిత్రంపై తన ఫోకస్ ను పెట్టాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నాడు.
సుకుమార్ దర్శకుడిగా సక్సెస్ అవుతూనే, తన చుట్టూ ఉన్న వారిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ను స్థాపించి తన శిష్యులను దర్శకులను చేస్తున్నాడు.
ఇక సుకుమార్ రైటింగ్స్ వ్యవహారాలను సుకుమార్ స్నేహితుడు ప్రసాద్ మ్యానేజర్ గా ఉంటూ మొత్తం చూసుకునే వాడు. అయితే ఆయన అకాల మరణంతో సుకుమార్ భార్య తబితా బండ్రెడ్డి ఇప్పుడు సుకుమార్ రైటింగ్స్ బాధ్యతలను చూసుకుంటోంది. స్క్రిప్ట్ పనుల నుండి ప్రొడక్షన్ పనుల వరకూ మొత్తం సుకుమార్ భార్య చేతుల్లోకి వచ్చింది. స్వయంగా భార్య రంగంలోకి దిగడంతో సుకుమార్ ప్రశాంతంగా పుష్ప పనులను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
736693 89651Keep up the great piece of function, I read couple of posts on this internet web site and I feel that your web blog is genuinely interesting and contains lots of superb details. 54440
127821 946359I admire your piece of work, regards for all of the interesting posts . 506708