ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు హయాంలో హత్యాచారానికి గురైన విద్యార్థిని సుగాలి ప్రీతి ఘటనకు సంబంధించి ‘న్యాయం’ కోసం చాలాకాలంగా ఉద్యమాలు జరుగుతున్న విషయం విదితమే. సుగాలి ప్రీతి తల్లి, తన ఆవేదన ప్రపంచానికి తెలియాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేయడంతో, కర్నూలు జిల్లాలో ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’ అంటూ భారీ ర్యాలీని చేపట్టింది జనసేన పార్టీ.
అయితే, ఈ ర్యాలీని దెబ్బకొట్టేందుకు అధికార పార్టీ నానా రకాల ప్రయత్నాలూ చేసింది. కొందరు, పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకుంటామనీ నినదించారు. వారందర్నీ ఉద్దేశించి ‘మీకు చేతనైతే, ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాకు రాబోతున్నారు కదా.. ఆయన దృష్టికి సుగాలి ప్రీతి ఘటనను తీసుకెళ్ళి, న్యాయం చేయమని డిమాండ్ చేయండి..’ అని ప్రశ్నించారు పవన్కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంతలా నినదించడం వల్లేనేమో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సుగాలి ప్రీతి తల్లిని కలిశారు కర్నూలు పర్యటనలో.
ఈ కేసులో దోషుల్ని శిక్షిస్తామంటూ ఆమెకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్నా ఇప్పటిదాకా ఈ కేసులో దోషుల్ని శిక్షించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం గమనార్హం. నిందితులకు రాజకీయ అండదండలుండడంతోనే ఈ కేసు నీరుగారిపోతోందన్న విమర్శలున్నాయి.
సాక్షాత్తూ సుగాలి ప్రీతి తల్లి, తమకు ప్రభుత్వ పెద్దలు కొందరు సాయం చేయడానికి నిరాకరించారనీ, వెకిలిగా మాట్లాడారనీ ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఏదిఏమైనా, తెలంగాణలో దిశ ఘటన జరిగితే, ఆ దిశ పేరుతో చట్టాన్ని రూపొందించిన వైఎస్ జగన్ ప్రభుత్వం, సుగాలి ప్రీతి విషయంలో అంత వేగంగా స్పందించకపోవడం ఆశ్చర్యకరమే. ఇప్పటికైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సుగాలి ప్రీతి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం, కేసు పరిశోధనలో వేగం పెంచి, దోషుల్ని శిక్షించాలని ఆశిద్దాం.
171024 66803I like this website because so significantly utile stuff on here : D. 596531
96978 185148Oh my goodness! a great post dude. Thanks a whole lot Nevertheless I will likely be experiencing trouble with ur rss . Dont know why Not able to sign up for it. Is there everybody acquiring identical rss concern? Anybody who knows kindly respond. Thnkx 2736