సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి హైదరాబాద్ లోని తన నివాసంలో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్ కు ఎనిమిది మంది కొడుకులు, నలుగురు కూతుళ్లు కాగా ఉమా మహేశ్వరి అందరిలోకి చిన్నవారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె మరణించినట్లు తెలుస్తోంది.
ఆమె ఇటీవలే తన కూతురికి కూడా వివాహం చేసారు. ఉమా మహేశ్వరి మొదట నరేంద్ర రాజన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. కొద్దికాలానికే విడాకులు తీసుకుని కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్ ను వివాహం చేసుకున్నారు.
ఉమా మహేశ్వరి మరణ వార్తను విన్న నందమూరి కుటుంబీకులు దిగ్బ్రాంతికి గురయ్యారు. తెలుగు దేశం పార్టీ నాయకుడు చంద్రబాబు, నారా భువనేశ్వరి ఉమా మహేశ్వరి నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు. కాగా ఉమా మహేశ్వరి కుటుంబసభ్యులు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది.
954266 315469Good post, nicely put together. Thanks. I will probably be back soon to check out for updates. Cheers 215893