Switch to English

కూటమి విజయం: విశాఖ స్టీల్ ప్లాంట్‌కి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,936FansLike
57,764FollowersFollow

విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం శుభవార్త చెప్పింది. గతంలో విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టిన కేంద్రమే, ఇప్పుడు అదే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు నడుం బిగించడం గమనార్హం. అప్పుడూ నరేంద్ర మోడీ ప్రభుత్వమే, ఇప్పుడూ నరేంద్ర మోడీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో వుంది.

గతంలో, విశాఖ ఉక్కు అమ్మకం దిశగా కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు, విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన విలువైన భూముల అమ్మకం దిశగా అప్పటి వైసీపీ సర్కార్ ప్రతిపాదనల్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ లేదా అమ్మకానికి వ్యతిరేకంగా జనసేన పార్టీ నినదించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదని జనసేనాని తేల్చి చెప్పారు. మరోపక్క, టీడీపీ కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించింది.

టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఏర్పాటు నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ అంశం కూడా మూడు పార్టీల అధినాయకత్వాల మధ్య చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం కానీయబోనని జనసేనాని పవన్ కళ్యాణ్ కుండబద్దలుగొట్టేసిన సంగతి తెలిసిందే.

పొత్తు ధర్మాన్ని పాటించిన బీజేపీ అధినాయకత్వం కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని సూత్రప్రాయంగా ప్రకటించింది. ఇప్పుడు తాజాగా, కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకి నడుం బిగిస్తూ, కీలకమైన నిర్ణయం తీసుకుంది.

కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడమే ఆ నిర్ణయం. ఈ ప్యాకేజీ విలువ సుమారు 17 వేల కోట్లుగా చెబుతున్నారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కూటమి పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క, కూటమి సాధించిన ఈ విజయంపై విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబుకీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కీ, ప్రధాని నరేంద్ర మోడీకీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

అధికారంలో వుండగా, విశాఖ అంటే.. అమ్మకాలకి అనువైనది.. అనే భావనలో వుండేవారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు భూములపై వైసీపీ గద్దలు కన్నేయడం, ఆ అమ్మకాల దిశగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనలు వుండడం చూశాం.

కానీ, విశాఖ ఉక్కుని కాపాడే బాధ్యతను కూటమి తన భుజానికెత్తుకుని, పదిహేడు వేలు కోట్ల ప్యాకేజీతో, విశాఖ ఉక్కుకి పూర్వ వైభవం వచ్చేలా చేస్తోంది.

సినిమా

Chiranjeevi: ‘ఆ సెంటిమెంట్ పక్కా.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ..” లైలా ప్రీ-రిలీజ్...

Chiranjeevi: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను షైన్ స్క్రీన్స్...

Ram Charan: క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. వివరాలివే

Ram Charan: రామ్ చరణ్ క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టి సందడి చేశారు. తాను ప్రాంచైజీగా ఉన్న క్రికెట్ టీమ్ ను కలుసుకుని వారిలో జోష్ నింపారు....

Nagarjuna: ‘తండేల్ లో నీ కష్టం కనిపించింది..’ చైతన్య విజయంపై నాగార్జున

Nagarjuna: నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ఘన విజయం సాధించి ధియేటర్లలో సందడి చేస్తోంది. దీనిపై నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. తండ్రిగా...

Allu Arjun: ‘అయిదేళ్ల పుష్ప జర్నీ అందరికీ ఎమోషన్..’ థాంక్స్ మీట్...

Allu Arjun: ‘పుష్ప 2 ది రూల్’ ఘన విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం థ్యాంక్స్‌ మీట్‌ ఘనంగా జరిగింది. వేడుకలో నటీనటులకు, సాంకేతిక...

Rashmika: ‘పుష్ప నాకెంతో స్పెషల్..’ థాంక్స్ మీట్ పై రష్మిక...

Rashmika: నిన్న జరిగిన ‘పుష్ప 2 ది రూల్’ థాంక్యూ మీట్ లో పాల్గొనలేకపోయిన రష్మిక టీమ్ ను ఉద్దేశించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. పుష్ప...

రాజకీయం

గెలుపోటములు: కేజ్రీవాల్ ఓ కేస్ స్టడీ.!

దేశ రాజధాని ఢిల్లీ.. అక్కడా సమస్యలున్నాయ్.! మంచి నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు.. వాట్ నాట్.! ఢిల్లీ ప్రజలు చాలాకాలంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అంటే, పార్లమెంటు సమావేశాలు.. ప్రధాని,...

చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?

సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ...

వేవ్స్ కమిటీలో మెగాస్టార్.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు..!

భారత్ ను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో వరల్డ్ ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ని నిర్వహించే దిశగా...

ప్రధాని మోదీ విశ్వాసం నిజమైంది : పవన్ కళ్యాణ్

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్పందన తెలియచేశారు. 2047 నాటికి మన దేశం అభివృద్ధి...

రోడ్లు.. అభివృద్ధి.. కూటమి ఘనత ఇదీ.!

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు కూర్చుని చర్చించుకుంటున్నా, రాష్ట్రంలో రోడ్ల గురించిన ప్రస్తావనే వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు శరవేగంగా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వ హయాంలో. కొత్త...

ఎక్కువ చదివినవి

టీడీపీ హయాంలో విద్యా వ్యవస్థలో సాధించిన విజయాలు ఇవే..!

ఇప్పుడు మాజీ సీఎం వైఎస్ జగన్ 'ఫీజు పోరు' చేపట్టడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ హయాంలో ఫీజు రీయంబర్స్ మెంట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడని గుర్తు చేస్తున్నారు. అదే...

అల్లు అర్జున్ కు స్పోక్స్ పర్సన్.. ఎందుకో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే మళ్లీ తన కెరీర్ మీద దృష్టి సారిస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత చాలా కాలంగా ఆయన పెద్దగా బయటకు రావట్లేదు. తాను కమిట్ అయిన...

పిఠాపురంలో ‘అపోలో’ మిషన్.! ఉపాసనకి థ్యాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్

ఉపాసన కొణిదెల అంటే తెలుసు కదా.? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. ఔను, పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి కోడలు ఉపాసన. మెగా పవర్ స్టార్...

వైఎస్ జగన్ హెచ్చరికలపై కూటమి అప్రమత్తమవ్వాల్సిందే.!

ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, ‘మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడతాం..’ అని ప్రస్తుత ప్రభుత్వాన్ని నడుపుతున్నవారిపై హెచ్చరికలు చేస్తోంటే, అధికారంలో ఇప్పుడున్నవాళ్ళు ఏం చెయ్యాలి.? అంటే, వైఎస్...

Sunil: ‘పుష్ప ఎఫెక్ట్ తో నాకు పాకిస్థానీ ఫ్యాన్స్..’ ఆరోజు జరిగింది చెప్పిన సునీల్

Sunil: ‘నేనొక లోకల్ ప్రొడక్ట్.. పుష్పతో ముద్ర వేసి ఎక్స్ పోర్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ చేశారు. పాకిస్థానీయులు కూడా నన్ను అభిమానిస్తున్నారు. ఇందుకు స్పెయిన్ లో నాకు ఎదురైన అనుభవమే ఉదాహరణ’ని అన్నారు...