కూటమి విజయం: విశాఖ స్టీల్ ప్లాంట్‌కి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,310FansLike
57,764FollowersFollow

విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం శుభవార్త చెప్పింది. గతంలో విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టిన కేంద్రమే, ఇప్పుడు అదే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు నడుం బిగించడం గమనార్హం. అప్పుడూ నరేంద్ర మోడీ ప్రభుత్వమే, ఇప్పుడూ నరేంద్ర మోడీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో వుంది.

గతంలో, విశాఖ ఉక్కు అమ్మకం దిశగా కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు, విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన విలువైన భూముల అమ్మకం దిశగా అప్పటి వైసీపీ సర్కార్ ప్రతిపాదనల్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ లేదా అమ్మకానికి వ్యతిరేకంగా జనసేన పార్టీ నినదించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదని జనసేనాని తేల్చి చెప్పారు. మరోపక్క, టీడీపీ కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించింది.

టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఏర్పాటు నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ అంశం కూడా మూడు పార్టీల అధినాయకత్వాల మధ్య చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం కానీయబోనని జనసేనాని పవన్ కళ్యాణ్ కుండబద్దలుగొట్టేసిన సంగతి తెలిసిందే.

పొత్తు ధర్మాన్ని పాటించిన బీజేపీ అధినాయకత్వం కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని సూత్రప్రాయంగా ప్రకటించింది. ఇప్పుడు తాజాగా, కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకి నడుం బిగిస్తూ, కీలకమైన నిర్ణయం తీసుకుంది.

కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడమే ఆ నిర్ణయం. ఈ ప్యాకేజీ విలువ సుమారు 17 వేల కోట్లుగా చెబుతున్నారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కూటమి పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క, కూటమి సాధించిన ఈ విజయంపై విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబుకీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కీ, ప్రధాని నరేంద్ర మోడీకీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

అధికారంలో వుండగా, విశాఖ అంటే.. అమ్మకాలకి అనువైనది.. అనే భావనలో వుండేవారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు భూములపై వైసీపీ గద్దలు కన్నేయడం, ఆ అమ్మకాల దిశగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనలు వుండడం చూశాం.

కానీ, విశాఖ ఉక్కుని కాపాడే బాధ్యతను కూటమి తన భుజానికెత్తుకుని, పదిహేడు వేలు కోట్ల ప్యాకేజీతో, విశాఖ ఉక్కుకి పూర్వ వైభవం వచ్చేలా చేస్తోంది.

సినిమా

Jana Nayagan: విజయ్ క్రేజ్.. ‘జననాయగన్’లో టైటిల్ కార్డు మార్చండి.. ఫ్యాన్స్...

Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ...

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల...

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు...

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే...

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత...

రాజకీయం

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

టీవీకే విజయ్ గెలుపు.! వైసీపీ హడావిడి ఏంటి మధ్యలో.?

ఓ వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే విజయ్‌ని కలిశారు. ఆ వివాహ వేడుక, వైఎస్ జగన్ బంధువులకు సంబంధించినది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. వివిధ...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: వృషభం వారికి ఆర్థిక లాభం… కుంభం వారికి కొత్త అవకాశాలు

మే 3 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం రాశులపై మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. కొందరికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తే, మరికొందరికి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన...

ఫ్రంట్‌పేజీలో సర్కారీ టాలెంట్… లోకేశ్‌ నిర్ణయానికి ప్రశంసల వెల్లువ!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభకు అరుదైన గుర్తింపు లభించింది. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలతో పత్రికల ఫ్రంట్‌పేజీలో ప్రత్యేక...

Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ మరింత పెద్దగా.. ఆసక్తి రేపుతున్న న్యూస్

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. ఇటివలి కాలంలో తెలుగులో ఏ సినిమాకీ చూడని హైప్ పెద్ది చూపిస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై అంచనాలు ఓ...

“విజయ్ దేవరకొండకు జోడీగా కృతి సనన్? కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర చర్చలు”

టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్ చర్చల్లోకి వచ్చింది. నటుడు Vijay Deverakonda హీరోగా రూపొందుతున్న కొత్త సినిమాలో బాలీవుడ్ స్టార్ Kriti Sanon హీరోయిన్‌గా నటించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ...

“సునీల్ కోసం ప్రత్యేక కథ… డైరెక్టర్‌గా రవి కె. చంద్రన్?”

టాలీవుడ్‌లో మరో ఆసక్తికర ప్రాజెక్ట్ చర్చల్లోకి వచ్చింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ Ravi K. Chandran దర్శకుడిగా కొత్త సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ చిత్రానికి కథను ప్రత్యేకంగా నటుడు Sunil కోసం...