స్మృతి మంధానా–పలాష్ ముచ్చల్ పెళ్లి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. నవంబర్ 23న జరగాల్సిన ఈ హైప్రొఫైల్ వివాహం, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానా అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడంతో వాయిదా పడింది. ఆయనను సాంగ్లీ ఆసుపత్రిలో చేర్పించగా, అదే సమయంలో పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడు ఇద్దరూ డిశ్చార్జ్ కావడంతో కొత్త పెళ్లి తేదీపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో డిసెంబర్ 7నే కొత్త మ్యారేజ్ డేట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని స్మృతి సోదరుడు శ్రవణ్ మంధాన స్పష్టత ఇచ్చాడు. హిందూస్థాన్ టైమ్స్కి మాట్లాడుతూ తనకు ఏ కొత్త తేదీ గురించి సమాచారం లేదని, పెళ్లి ఇంకా వాయిదా దశలోనే ఉందని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డిసెంబర్ 7 తేదీ పూర్తిగా ఊహాగానమేనని తెలిపాడు. కుటుంబం అధికారికంగా ప్రకటించిన తరువాతే నిజమైన సమాచారమని చెప్పాడు.
ఇదిలా ఉండగా, పలాష్ తల్లి అమితా ముచ్చల్ కూడా పెళ్లి వాయిదాపై స్పందించింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిస్థితి రెండు కుటుంబాలను తీవ్రంగా కలచివేసిందని, స్మృతి–పలాష్ ఇద్దరూ చాలా బాధపడ్డారని చెప్పింది. అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా చివరి నిమిషంలో వేడుక ఆగిపోవడం అందరినీ కలతపరిచిందని, త్వరలోనే అన్ని సవ్యంగా జరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో పలాష్పై గతంలో వచ్చిన లవ్ అఫైర్ రూమర్స్, సోషల్ మీడియాలో బయటపడ్డ స్క్రీన్షాట్లు కూడా మళ్లీ వైరల్ కావడంతో కొత్త చర్చలు మొదలయ్యాయి. అయితే అవి పాత విషయాలేనని, ఎలాంటి సంబంధం లేదని ఆ యువతి ఇప్పటికే వెల్లడించింది. ఆసుపత్రిలో చికిత్స పొందిన పలాష్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు.
మొత్తం మీద స్మృతి మంధానా–పలాష్ ముచ్చల్ పెళ్లి తేదీపై సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా హడావుడి నిజం కాదని, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏ పోస్టునూ నమ్మొద్దని కుటుంబం స్పష్టం చేసింది. అభిమానులు ప్రస్తుతం కొత్త అప్డేట్ కోసం వేచి చూస్తున్నారు.
