Switch to English

స్మృతి–పలాష్ పెళ్లి పై కుటుంబం క్లారిటీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,201FansLike
57,764FollowersFollow

స్మృతి మంధానా–పలాష్ ముచ్చల్ పెళ్లి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 23న జరగాల్సిన ఈ హైప్రొఫైల్ వివాహం, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానా అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడంతో వాయిదా పడింది. ఆయనను సాంగ్లీ ఆసుపత్రిలో చేర్పించగా, అదే సమయంలో పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడు ఇద్దరూ డిశ్చార్జ్ కావడంతో కొత్త పెళ్లి తేదీపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో డిసెంబర్ 7నే కొత్త మ్యారేజ్ డేట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని స్మృతి సోదరుడు శ్రవణ్ మంధాన స్పష్టత ఇచ్చాడు. హిందూస్థాన్ టైమ్స్‌కి మాట్లాడుతూ తనకు ఏ కొత్త తేదీ గురించి సమాచారం లేదని, పెళ్లి ఇంకా వాయిదా దశలోనే ఉందని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డిసెంబర్ 7 తేదీ పూర్తిగా ఊహాగానమేనని తెలిపాడు. కుటుంబం అధికారికంగా ప్రకటించిన తరువాతే నిజమైన సమాచారమని చెప్పాడు.

ఇదిలా ఉండగా, పలాష్ తల్లి అమితా ముచ్చల్ కూడా పెళ్లి వాయిదాపై స్పందించింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిస్థితి రెండు కుటుంబాలను తీవ్రంగా కలచివేసిందని, స్మృతి–పలాష్ ఇద్దరూ చాలా బాధపడ్డారని చెప్పింది. అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా చివరి నిమిషంలో వేడుక ఆగిపోవడం అందరినీ కలతపరిచిందని, త్వరలోనే అన్ని సవ్యంగా జరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో పలాష్‌పై గతంలో వచ్చిన లవ్ అఫైర్ రూమర్స్, సోషల్ మీడియాలో బయటపడ్డ స్క్రీన్‌షాట్లు కూడా మళ్లీ వైరల్ కావడంతో కొత్త చర్చలు మొదలయ్యాయి. అయితే అవి పాత విషయాలేనని, ఎలాంటి సంబంధం లేదని ఆ యువతి ఇప్పటికే వెల్లడించింది. ఆసుపత్రిలో చికిత్స పొందిన పలాష్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు.

మొత్తం మీద స్మృతి మంధానా–పలాష్ ముచ్చల్ పెళ్లి తేదీపై సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా హడావుడి నిజం కాదని, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏ పోస్టునూ నమ్మొద్దని కుటుంబం స్పష్టం చేసింది. అభిమానులు ప్రస్తుతం కొత్త అప్డేట్ కోసం వేచి చూస్తున్నారు.

సినిమా

8 రోజుల్లో రాజా సాబ్… ఇంకా దూరమే గమ్యం!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ మధ్య తన ప్రయాణాన్ని...

మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర...

“చిరంజీవి సినిమా బాగుందంట…”ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్… 5 రోజుల్లోనే ₹226...

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ...

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

రాజకీయం

పవన్ కళ్యాణ్: పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే కూటమి ప్రభుత్వం… గ్రీన్ ఎనర్జీలో ఏపీకి కొత్త దిశ

పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వాలు మారినా విధానాల్లో స్థిరత్వం ఉండాలన్నదే తమ ప్రభుత్వ...

మాట నిలబెట్టుకున్న సీఎం… ఉద్యోగుల ఖాతాల్లో నగదు

సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన పండుగలా మార్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల...

Liquor Scam Case: విజయ్ సాయిరెడ్డికి ఈడీ నోటీసులు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన...

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

ఎక్కువ చదివినవి

సంక్రాంతి బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న మెగా సినిమా!

సంక్రాంతి 2026 సీజన్‌లో ప్రేక్షకుల మొదటి ఎంపికగా నిలిచిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. విడుదలైన తొలినాళ్ల నుంచే ఈ సినిమా థియేటర్ల వద్ద అసాధారణ వాతావరణాన్ని సృష్టిస్తోంది. తెలుగురాష్ట్రాల...

తెలంగాణలో ఎన్నికల సమరానికి జనసేన సిద్ధం

తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న అన్ని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన...

సంక్రాంతికి నారావారిపల్లె వేదిక.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాకతో గ్రామంలో సందడి

చంద్రగిరి మండలంలోని నారావారిపల్లె మరోసారి రాజకీయ, కుటుంబ, సాంస్కృతిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్య–ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి నారావారిపల్లెకు చేరుకున్నారు. సంక్రాంతి పండుగ వేళ సీఎం...

Daily Horoscope: మేషంలో ఉద్యోగ అవకాశాలు, వృషభంలో ఆర్థిక లాభాలు

జనవరి 13, 2026 బుధవారం రాశిఫలాలు: మేషం (Aries): ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. పై అధికారుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో చిన్న విషయాలపై చర్చలు ఉండొచ్చు....

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్… 5 రోజుల్లోనే ₹226 కోట్ల గ్రాస్

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా...