జగన్ కాలంలో మెడికల్ కళాశాలలు నత్తనడక – కూటమి పిపిపి మోడల్‌తో వేగం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,411FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల అభివృద్ధి అంశంపై టీడీపీ విడుదల చేసిన ‘టాకింగ్ పాయింట్స్’ ఇవీ.. ఈ ప్రకటనలో జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానాల మధ్య స్పష్టమైన తేడా చూపించారు.

టీడీపీ వివరాల ప్రకారం 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి మొత్తం రూ.8,480 కోట్లు అవసరం కాగా, జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఖర్చు చేసినది కేవలం రూ.1,550 కోట్లు మాత్రమే. అంటే 18.2 శాతం ఖర్చు మాత్రమే జరిగింది. ఇక ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.786.82 కోట్లు ఖర్చు చేసి 9.2 శాతం పనులు పూర్తి చేసినట్లు వివరించారు.

జగన్ ప్రభుత్వ వేగంతో వెళ్లితే 17 మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి 20 నుంచి 25 సంవత్సరాలు పట్టేదని, కానీ పిపిపి మోడల్‌లో కేవలం రెండేళ్లలోనే ఈ కాలేజీలు పూర్తి చేయగలమని టీడీపీ తెలిపింది.

జగన్ హయాంలో ప్రారంభమైన 5 మెడికల్ కాలేజీల్లో కేవలం 500 సీట్లు మాత్రమే వచ్చాయని, అందులో 213 కన్వీనర్ కోటా సీట్లు కాగా 287 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఉన్నాయని విమర్శించారు. కూటమి పిపిపి మోడల్‌లో 1,700 సీట్లు రావొచ్చని, అందులో 850 కన్వీనర్ కోటా సీట్లు ఉంటాయని చెప్పారు.

జగన్ కాలంలో తీసుకున్న విధానాల వల్ల 20–25 ఏళ్లలో కొత్త డాక్టర్లు తయారు కావడమే కష్టమని, అయితే కూటమి పిపిపి మోడల్‌తో 20 ఏళ్లలో దాదాపు 50,000 మంది డాక్టర్లు సమాజానికి సేవ చేసే అవకాశం ఉందని వివరించారు.

జగన్ ప్రారంభించిన కాలేజీల్లో ఇన్‌పేషెంట్ బెడ్లు 2,500 మాత్రమే ఉన్నా, కూటమి ప్రణాళికలో 17 కాలేజీల్లో 8,500 బెడ్లు ఉంటాయని, వాటిలో 5,950 ఉచితంగా పేదలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

టీడీపీ ప్రకారం జగన్ ప్రతిపాదించిన కాలేజీల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు లేకపోయినా, కూటమి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త మెడికల్ కాలేజీలను ఎయిమ్స్ స్థాయి సౌకర్యాలతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

ఇక పిపిపి మోడల్‌పై జగన్ చేస్తున్న విమర్శలను టీడీపీ ఖండించింది. “ఇది ప్రైవేటులకు ఇచ్చే ప్రాజెక్టు కాదు. నిర్మాణం, నిర్వహణ తర్వాత 33 ఏళ్లకు ఆస్తి ప్రభుత్వానికి తిరిగి వస్తుంది. పేదలకు ఉచిత వైద్యం అందేలా ఈ మోడల్ రూపొందించబడింది,” అని పార్టీ స్పష్టం చేసింది.

టీడీపీ విమర్శల సారాంశం – జగన్ హయాంలో వైద్య రంగానికి నష్టం జరిగిందని, ఇప్పుడు పిపిపి మోడల్‌తో ఆ లోటు తీర్చే ప్రయత్నం జరుగుతోందని చెబుతోంది.

సినిమా

Bala Krishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Bala Krishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందా..? ఇండస్ట్రీ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్....

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

రాజకీయం

పయ్యావుల ప్రశ్నలతో మండలిలో బొత్సకు ఇబ్బంది

అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర, రాష్ట్ర...

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, వీఏవోలతో చర్చకు సిద్ధం: నారా లోకేష్

అమరావతి: అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వీఏవోల సమస్యలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయాల్సిన అవసరం...

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం: నారా లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్...

ఎక్కువ చదివినవి

ఫేక్ ప్రచారాలకి కట్టడి ఎలా.? కూటమి ప్రభుత్వం అంతర్మధనం.!

ఏదన్నా ఓ మంచి పని చేయాలన్న ప్రయత్నం మొదలయ్యేటప్పటికే, దుష్ప్రచారం అంతకన్నా ముందే విపరీతమైన స్థాయిలో జరిగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చాలా చాలా చిత్రమైన పరిస్థితి ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,...

Kodali Nani: జైలుకు సిద్ధమా? సానుభూతి రాజకీయాల వైపు అడుగులా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారారు Kodali Nani. ఇటీవల మాజీ మంత్రి Ambati Rambabuను పరామర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పరామర్శలో భాగంగా పెద్దగా దూకుడు...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే పాటలు హిట్ అయితే ఆ సినిమాపై...

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.. నాగచైతన్య హీరోగా నటించిన ‘వృషకర్మ’ ఫస్ట్...

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...