కెనడాలో భీతిల్లే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మూసి ఉన్న పాఠశాలల్లో వందలకొద్దీ చిన్నారుల అస్థిపంజరాలు బయటపడుతున్నాయి. బ్రిటిష్ కొలంబియాలోని ఓ మూసి ఉన్న పాఠశాలలో గత నెల 200 అస్థిపంజరాలు బయటపడగా.. తాజాగా వాంకోవర్ లోని మరో రెసిడెన్షియల్ స్కూలు ఆవరణలో 600కి పైగా అస్థిపంజరాలు బయటపడటం సంచలనం సృష్టించింది. గతనెలలో కామ్ లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూలు ఆవరణలో 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడటంతో తీవ్ర కలకలం రేగింది. దీంతో అధికారులు దేశవ్యాప్తంగా మూసి ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లపై దృష్టి సారించారు. ఈ క్రమంలో కొవెస్సెస్ ఫస్ట్ నేషన్ ప్రాంతంలోని మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో పరిశీలించగా.. 600కి పైగా సమాధులు వెలుగుచూశాయి.
ఈ ఆశ్రమ పాఠశాల 1899 నుంచి 1997 మధ్య రోమన్ కాథలిక్ చర్చి ఆధ్వర్యంలో నడిచింది. ఒకప్పుడు ఆయా పాఠశాలల్లో బలవంతపు మతమార్పిళ్లు జరిగేవని, మాట విననివారిని తీవ్రంగా కొట్టేవారనే ఆరోపణలున్నాయి. చిన్నారులపై శారీరక, లైంగిక వేధింపులు జరిగాయని, మాతృభాష మాట్లాడినందుకు పిల్లలను చితకబాదేవారని ఇటీవల కెనడా ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇలాంటి చర్యల వల్లే దాదాపు 6వేల మందికి పైగా పిల్లలు చనిపోయి ఉంటారని అంచనా. కాగా, తాజా ఘటనలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దారుణాల వెనుక వాస్తవాలను బయటపెడతామని పేర్కొన్నారు.
336263 315395Was koche ich heute – diese Frage stellen sich tag fuer tag viele Menschen. Und wir haben tag fuer tag die perfeckte Antwort darauf! Besuchen Sie uns auf unserer Webseite und lassen Sie sich von uns beraten . Wir freuen uns auf Sie! 645222