లడ్డూ విషయంలో అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. అసలు కల్తీ జరిగింది అనడానికి ఆధారాలు ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే.. ఏపీ ప్రభుత్వ తరఫు లాయర్లు కూడీ నీళ్లు నమిలే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. దాంతో ఇదే విషయంలో ఇప్పటికే సిట్ దర్యాప్తు కమిటీని వేసిన ప్రభుత్వం.. వెంటనే దాన్ని ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఆయన తిరుమలలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ప్రభుత్వ తరఫు లాయర్ల సూచన ప్రకారం దర్యాప్తును తాత్కాళికంగా నిలిపివేస్తున్నామన్నారు. తదుపరి విచారణ ప్రకారం దర్యాప్తు ఉంటుందని తెలిపారు. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం అనవసరంగా స్టెప్ తీసుకుందా అనే విమర్శలు వస్తున్నాయి. ఆ మాత్రం ఆధారాలు లేకుండానే కల్తీ జరిగిందంటూ ప్రచారానికి తెరలేపారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇంత సిల్లీగా ఎలా ఆలోచించింది అంటూ అడుగుతున్నారు చాలా మంది.
చంద్రబాబు ఎంతో అనుభవం ఉండి కూడా.. లడ్డూ విషయంలో సిట్ దర్యాప్తు వేసి అనవసరంగా రాంగ్ స్టెప్ తీసుకున్నారా అని అంటున్నారు. ఏదేమైనా కూడా ఈ విషయంలో చంద్రబాబు అనవసర స్టెప్ తీసుకుని చివరకు జగన్ కు మేలు చేశారని చర్చ జరుగుతోంది ఏపీ వ్యాప్తంగా.
